బొంరాస్పేట, జనవరి 20 : అట్ట ముక్కలు, బంకమట్టితో అరచేతిలో ఇమిడే విధంగా అయోధ్య శ్రీరామ మందిరాన్ని తయారు చేసి తన నైపుణ్యాన్ని చాటుకుంది వికారాబాద్ మండలం మద్గుల్ చిట్టెంపల్లి గ్రామానికి సాయిప్రియ.
అయోధ్యలో ఈ నెల 22వ తేదీన శ్రీరాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ జరుగనున్న వేళ సాయిప్రియ రామ మందిరాన్ని రూపొందించి తన భక్తిని చాటుకున్నది.