చేవెళ్లటౌన్, జనవరి 12: నేటి యువత స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని ఎంపీ రంజిత్రెడ్డి, రాష్ట్ర శాసన సభాధిపతి గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. చేవెళ్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని వారు ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎంపీ, స్పీకర్ మాట్లాడుతూ భారతదేశ ప్రఖ్యాతిని, మన సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అన్నారు. భారతదేశంలోనూ, పాశ్చాత్య దేశాల్లోనూ తన గురువు రామకృష్ణ పరమాహంస పేరు మీదుగా రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను స్థాపించి ఎందరో విద్యావంతులను సమాజసేవకు అంకితం చేశారాన్నారు.
యువతకు స్ఫూర్తిగా, మార్గనిర్దేశకుడిగా నిలిచిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా చేవెళ్లలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమన్నారు. మందలో ఒకడిగా కాకుండా.. వందలో ఒకడిగా ఉండాలంటూ ప్రతి ఒక్కరిని ఆయన ఆలోచింపజేశారన్నారు. కార్యక్రమంలో అఖిల భారత సాహిత్య పరిషత్ సంఘటన కార్యదర్శి భాస్కర యోగి, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ బాధ్యుడు భీం భరత్, జడ్పీటీసీ సభ్యురాలు మాలతి, మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్, మాజీ ఎంపీపీ బాల్రాజ్, చేవెళ్ల గ్రామ సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డి, చేవెళ్ల సొసైటీ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, ముడిమ్యాల సొసైటీ చైర్మన్ గోనే ప్రతాప్రెడ్డి, వైస్ చైర్మన్ ఎర్ర మల్లేశ్, ఉప సర్పంచ్ గంగి యాదయ్య, మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్, నాయకులు రమణారెడ్డి, ఆగి రెడ్డి, అత్తెల్లి అనంత్ రెడ్డి, దుర్గా ప్రసాద్, పెంజర్ల అనంత రెడ్డి, గోపాలాచారి పాల్గొన్నారు.