హైదరాబాద్ : దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసిన స్థలాన్ని సిర్పుర్కర్ కమిషన్ బృందం ఆదివారం పరిశీలించింది. షాద్నగర్ చేరుకున్న కమిషన్ సభ్యులు..చటాన్పల్లి వద్ద ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని, దిశ మృతదేహాన్ని దహనం చేసిన స్థలాన్నీ పరిశీలించారు. ఎన్కౌంటర్ స్థలంలో క్షేత్రస్థాయి అంశాలను పరిశీలించారు.
సిర్పుర్కర్ కమిషన్ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.