నందిగామ, నవంబర్ 20: గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలంలోని అప్పరెడ్డిగూడ, వీర్లపల్లి, చర్ల అంతిరెడ్డిగూడ, మొదళ్లగూడ, మామిడిపల్లి, మజీద్ మామిడిపల్లి, శ్రీనివాసులగూడ, మంచన్పహాడ్, ఈదులపల్లి, మోత్కూలగూడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు.
మంగళహారతులు, బతుకమ్మ, బోనాలతో మహిళలు, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ ఉద్యమం చేస్తున్న సమయంలో అప్పటి పాలకులు ఎన్నో అపోహలు అనుమానాలు సృష్టించారని, వాటన్నింటిని పటాపంచలు చేస్తూ ఉద్యమం చేసి ఢిల్లీ పాలకుల మెడలు వంచి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని తెలిపారు. సాధించిన రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని విధాలా అభివృద్ధి చేశారన్నారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నవీన్రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మంజుల, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షురాలు లతాశ్రీశైలం, ఎంపీటీసీ మాధవి, సర్పంచ్లు ఉమా, నర్సింహ, చంద్రారెడ్డి, కవిత, స్వామి, ఎల్లమ్మ, కో-ఆప్షన్ సభ్యుడు బేగ్, నాయకులు ఎమ్మె సత్యనారాయణ పాల్గొన్నారు.
శంకర్పల్లి : మున్సిపాలిటీని ఎంతో అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే కాలె యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి కోట్ల రూపాయలు మంజూరు చేయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన యాదయ్యకే ప్రజలు మళ్లీ పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమంలో నవాబ్పేట జడ్పీటీసీ జయమ్మ, శంకర్పల్లి జడ్పీటీసీ గోవిందమ్మ, కౌన్సిలర్ శ్వేత, శ్రీనాథ్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్కుమార్, వాసుదేవ్ కన్నా, పాండురంగారెడ్డి, బాలకృష్ణ, రఘునందన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
షాబాద్ : మండలంలోని రుద్రారం, కుమ్మరిగూడ, పెద్దవేడు తదితర గ్రామాల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాలె యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కుమ్మరిగూడ గ్రామ సర్పంచ్ పోనమోని కేతన, బీఆర్ఎస్ నాయకులు రమేశ్యాదవ్, యాదిరెడ్డి, సంజీవరెడ్డి, వెంకట్రెడ్డి, నక్క అవినాశ్గౌడ్, సింగప్పగూడెం నర్సింహులు, బుక్క రవి పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : నియోజకవర్గ పరిధి చేవెళ్ల మండలంలోని 37 గ్రామ పంచాయతీలు, అనుబంధ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే కాలె యాదయ్య తరఫున సోమవారం ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకుల ప్రచారం ఊపందుకున్నది. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కాలె యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపిస్తే అభివృద్ధి చేస్తారని ప్రజలకు వివరించారు. ప్రచార కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ బాల్రాజ్, బీసీసెల్ మండల అధ్యక్షుడు రాములు, సర్పంచ్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కేసారం శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ పాల్గొన్నారు.
షాద్నగర్టౌన్ : బీఆర్ఎస్ అంటేనే అభివృద్ధి అని షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. మున్సిపాలిటీలోని 28వ వార్డు గాంధీనగర్కాలనీలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను, షాద్నగర్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ కారుగుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో శ్రీశైలం, రఘుమారెడ్డి, రాఘవేందర్రెడ్డి, అరవింద్, ముత్యాలు, ప్రవీణ్, శేఖర్, రాజు, సత్యం, చందు, అభిలాష్, ప్రవీణ్గౌడ్, యాదయ్య పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : చేవెళ్ల పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేసి మోసపోవద్దని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల పట్టణ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, దండు సత్యం, శివశంకర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, బుచ్చయ్య, మల్లేశ్, మల్గారి లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, జంగయ్య, బాలాజీ పాల్గొన్నారు.
కేశంపేట : గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్కు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రచారానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది.
చేవెళ్ల రూరల్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేవెళ్ల నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి పట్లొళ్ల కార్తిక్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని సంగప్పగూడ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. షాబాద్, శంకర్పల్లి మండలాల్లో ఇప్పటికే అనేక పరిశ్రమలు నెలకొల్పామని తద్వారా మహిళలలు, యువతకు అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 111 జోవోను రద్దు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని అన్నారు.
చేవెళ్లలో పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థిపై భూదందాలు, మర్డర్ కేసులు ఉన్నాయని, కేసులు ఏమైనా అవార్డులా, రివార్డులా అని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచ్ రహీమా బేగం, మైనార్టీ నాయకుడు అలీ, వైస్ ఎంపీపీ ప్రసాద్, మాజీ ఎంపీపీ బాల్రాజ్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నరేందర్, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, సర్పంచ్లు శేరి స్వర్ణలత, సులోచన, విజయలక్ష్మి, శేరి శివారెడ్డి, లావణ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఫయాస్, నరేందర్, బీఆర్ఎస్ నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు.
మంచినీటి కోసం
మొయినాబాద్ : కాంగ్రెస్ పాలనలో మంచినీటి కోసం మహిళలు కిలో మీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవడానికి హరిగోస పడ్డారని చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని పెద్దమంగళారం, సురంగల్, కేతిరెడ్డిపల్లి గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచినీళ్లు తాపని కాంగ్రెస్ నేడు ఓటు వేయాలని ప్రజల ముందుకు ఏ మొహం పెట్టుకుని వస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలను రైతులు మరువరన్నారు. పగటి వేషగాళ్ల మాదిరిగా వస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మి మోసపోవద్దని చెప్పారు.
కార్యక్రమంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అనంతరెడ్డి, బీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షులు జయవంత్, బాల్రాజ్, ప్రధాన కార్యదర్శి నర్సింహాగౌడ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, సర్పంచ్లు గడ్డం లావణ్య, శోభారెడ్డి, ఎంపీటీసీలు శ్రీనివాస్, మల్లేశ్, అర్జున్, లత, శ్రీలత,అంజయ్య, నాయకులు గణేశ్రెడ్డి, జైపాల్రెడ్డి, అంజిరెడ్డి, భాస్కరాచారి, ప్రవీన్రెడ్డి, రవీందర్రెడ్డి, మహేశ్యాదవ్, యాదగిరియాదవ్, సురేందర్గౌడ్, పరమేశ్ పాల్గొన్నారు.