బొంరాస్పేట, ఆగస్టు 14 : గృహలక్ష్మి పథకం కింద సొంత ఇంటి నిర్మాణం కోసం వచ్చిన దరఖాస్తులను మండలస్థాయి అధికారుల బృందం సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. ఇంటి నిర్మాణం కోసం ఖాళీ స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల ఆర్థిక సహాయం చేయనున్నది.గృహలక్ష్మి పథకం కింద సొంత ఇంటి నిర్మాణం కోసం వచ్చిన దరఖాస్తులను మండలస్థాయి అధికారుల బృందం సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. ఇంటి నిర్మాణం కోసం ఖాళీ స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల ఆర్థిక సహాయం చేయనున్నది. ఇందు కోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా మండలంలో 5154 మంది దరఖా స్తులు చేసుకున్నారు. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి 9 బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. సోమవారం డిప్యూటీ తహసీల్దార్ రవి బొంరాస్పేటలో, ఎంపీడీవో పాండు తుంకిమెట్లలో బురాన్పూర్లో సీసీ యాదయ్య, లింగన్పల్లి, మదన్పల్లిలో ఏఈవోలు క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారుల ఇంటింటికి వెళ్లి వారికి ఇప్పటికే ఏమైనా ఇల్లు ఉందా, లేకుంటే ఇంటి నిర్మాణం కోసం ఖాళీ స్థలం ఉందా, స్థానికంగానే ఉంటున్నారా, ఆధార్కార్డు, రేషన్కార్డు కలిగి ఉన్నారా వంటి వివరాలను అధికారులు సేకరించారు.
వికారాబాద్: వికారాబాద్ మండల పరిధిలో గృహలక్ష్మి పథకానికి దరఖా స్తులు చేసుకున్న వారి వివరాలను పరిశీలించినట్లు ఎంపీడీవో సత్తయ్య తెలిపారు. సోమ వారం మండల పరిధిలోని గోధుమగూడ, అత్తెల్లి, సిద్దులూర్, మదన్పల్లి, మైలార్ దేవరంపల్లి, పులుసు మామిడి, నారాయణపూర్ గ్రామాల్లో దరఖాస్తుల దారుల ఇంటికి వెళ్లి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో దాదాపు 84 మంది దరఖాస్తులను పరిశీలించినట్లు పేర్కొన్నారు. అనంతరం స్త్రీ శక్తి భవనంలో సంబంధిత అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. జీవో 25 ప్రకారం గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపిక ఏవిధంగా చేయాలి, వారికి అవసరమైన సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేసే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో నాగరాజు, ఏపీవో శ్రీనివాస్, ఈసీ నవీన్కు మార్, ఏవో జ్యోతి, ఏపీఎం లక్ష్మయ్య, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కొడంగల్: మండల పరిధిలో మొత్తంగా 3400లకు పైగా దరఖాస్తులు అందగా ఎంపీ డీవో, ఏపీవో, ఏపీవో, తహసీల్దార్, ఏపీఎం, ఏవో అంగన్వాడీలు గ్రామాల్లో దరఖా స్తులను పరిశీస్తున్నారు. పర్సాపూర్ గ్రామంలో తహసీల్దార్ విజయ్కుమార్, సర్పంచ్ సయ్యద్ అంజద్, ఎంపీటీసీ గోవిందమ్మ, పంచాయతీ కార్యదర్శి దరఖాస్తుల పరిశీలన చేశారు. వివిధ అంశాలను పరిశీలించి వివరాలను సేకరిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు.
మోమిన్పేట: గృహలక్ష్మి పథకం సొంత స్థలం ఉన్నవారికి వర్తిస్తుందని ఎంపీడీవో శైలజా రెడ్డి అన్నారు. సొమవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్య దర్శులతో గృహలక్ష్మి దరఖాస్తుల పరిశీలనపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దరఖాస్తుదారులు అధికారులు ఇంటికి వచ్చిన ప్పుడు సంబంధిత స్థలం, ధ్రువ పత్రా లను వారికి చూపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో శంకర్, ఈసీ వికాస్, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
ధారూరు: గృహలక్ష్మి దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనకు మండలంలో నాలుగు బృం దాలను ఏర్పాటు చేసినట్లు ఎంపిడీవో చంద్రశేఖర్ తెలిపారు. ఎంపీడీవో చంద్రశేఖర్, తహసీల్దార్ భువనేశ్వర్, ఎంపీవో షఫీఉల్లా, ఏపీఎం శ్రీనివాస్ బృందాలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 32 గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులను క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తామని తెలిపారు. సుమారుగా మూడువేల దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
కులకచర్ల :గృహలక్ష్మి దరఖాస్తుల పరిశీలన పారదర్శకంగా నిర్వహించి అర్హులైన వారిని గుర్తించాలని కులకచర్ల తహసీల్దార్ మురళీధర్ తెలిపారు. సోమవారం మండల కేం ద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నాగవేణి, ఎంపీడీవో సూపరింటెండెంట్ సురేశ్, ఎంపీవో కరీమ్, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
దోమ: గృహలక్ష్మి పథకం దరఖాస్తుల పరిశీలన ప్రారంభించినట్లు డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్ పేర్కొన్నారు. ఊటుపల్లి దాని అనుబంధ తండాల్లో సోమవారం 32 దరఖాస్తులను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లాల్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.