ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 1 : రంగారెడ్డిజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ గ్రామానికి చెందిన సత్తు వెంకటరమణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను వెలువరించింది. మరో ఐదుగరు డైరెక్టర్లను కూడా నియమించారు. ప్రస్తుతం ఉన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి ఈ పదవిలో దీర్ఘకాలికంగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న సత్తు వెంకటరమణారెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కిషన్రెడ్డితోపాటు జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డి కూడా బలపర్చారు.
మరో ఐదుగురు డైరెక్టర్ల నియామకం
గ్రంథాలయ సంస్థ చైర్మన్తో పాటు జిల్లాలోని షాద్నగర్కు చెందిన నక్కల వెంకటేశ్గౌడ్, మీర్పేట్కు చెందిన పంతంగి మాధవి, ఆమనగల్లు మున్సిపాలిటీకి చెందిన సమతం రాధమ్మ, మొయినాబాద్కు చెందిన గుంగుత్రి నక్షత్రం, శంషాబాద్కు చెందిన దుద్యాల జయమ్మలను డైరెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
బయోడేటా..
పేరు : సత్తు వెంకటరమణారెడ్డి
తండ్రి పేరు : సత్తు కిషన్రెడ్డి
విద్యార్హతలు : బీఏ బీఈడీ
గ్రామం : తులేకలాన్,
ఇబ్రహీంపట్నం మండలం, రంగారెడ్డిజిల్లా
నిర్వహించిన పదవులు తులేకలాన్ ఎంపీటీసీ, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్గ్రంథాలయ వ్యవస్థను మరింత పటిష్టపరుస్తా – సత్తు వెంకటరమణారెడ్డి
జిల్లాలో గ్రంథాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తా. జిల్లాలో ఉన్న గ్రంథాలయాలన్నింటినీ ఆధునీకరించి అన్ని రకాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకువస్తా. ముఖ్యంగా ఉద్యోగాల అన్వేషణలో ఉన్న యువతకు అవసరమైన కాంపిటీషన్కు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచుతాం. నాపై నమ్మకం ఉంచి పదవిని ఇప్పించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, మంత్రి సబితాఇంద్రారెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలందరికీ కృతజ్ఞతలు.