కొడంగల్, జనవరి 23 : నియోజకవర్గంలోని కోస్గి మున్సిపల్ కేంద్రంలో రాష్ట్ర సర్కార్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల మంజూరుపై ఉస్మానియా విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మంగళవారం ఉస్మానియా క్యాంపస్ ఆవరణలో సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి ఉస్మానియా విద్యార్థి సంఘాల నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దౌల్తాబాద్ మండలానికి చెందిన ప్రొఫెసర్ జయశంకర్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి శ్రీను మాట్లాడుతూ విద్య, ఉద్యోగం, ఉపాధి, సంక్షేమ రంగాల్లో కొడంగల్ ఎంతో వెనుకబడి ఉన్నదని, కోస్గి పట్టణంలో ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా విద్యార్థి సంఘాల నాయకులు సాయికుమార్, భీంరావు, శ్రీనివాస్, బాలచందర్, సందీప్, భానుచందర్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.