మొయినాబాద్ : పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులు చాలా బాగున్నాయని జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్ అన్నారు. మండల పరిధిలోని బాకారంలో చేపట్టిన పల్లె ప్రగతి పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. గ్రామంలో నిర్మించిన డంపింగ్యార్డు, పల్లె ప్రకృతివనం, నర్సరీతో పాటు వైకుంఠధామాన్ని పరిశీలించారు. అదే విధంగా సెప్టెంబర్ నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండటంతో పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం పంచాయతీ రికార్డులను పరిశీలించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో పనులు బాగా చేయడంతో పంచాయతీ కార్యదర్శి తారాబాయిని ఆయన అభినందించారు.
సెప్టెంబర్ ఒకటి నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని సూచించారు. పాఠశాలను శానిటైజ్ చేయాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీదే అని పేర్కొన్నారు. ఆయనతో పాటు సర్పంచ్ రాఘవరెడ్డి, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీవో సల్మాన్రాజ్, పంచాయతీ కార్యదర్శి తారాబాయి, ఏపీవో సుధాకర్ పాల్గొన్నారు.