షాబాద్ : చేవెళ్ల నియోజకవర్గంలో గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్ల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయా గ్రామాలు, పాఠశాలల్లో సర్పంచులు, ఉపాధ్యాయులు జాతీయ జెండాలు ఎగురవేశారు. చేవెళ్లలోని పీఎంఆర్ మెడికల్ కళాశాలలో ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన జెండా వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల జడ్పీటీసీలు పట్నం అవినాశ్రెడ్డి, మర్పల్లి మాలతీ, కాలె శ్రీకాంత్, గోవిందమ్మ, ఎంపీపీలు కోట్ల ప్రశాంతిరెడ్డి, మల్గారి విజయలక్ష్మి, గునుగుర్తి నక్ష్రత్రం, గోవర్దన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
షాద్నగర్, షాద్నగర్టౌన్, జనవరి 26 : గణతంత్ర దినోత్సవాలను షాద్నగర్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. షాద్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఆవిష్కరించి జెండా వందనం సమర్పించారు. అదే విధంగా తాసీల్దార్ కార్యాలయంలో తాసీల్దార్ గోపాల్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఖాజా ఇద్రీస్ ఆహ్మద్, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రాజేశ్వరీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే భీష్వ కిష్టయ్య పాల్గొని జెండా వందనం సమర్పించారు. షాద్నగర్ కోర్టు ఆవరణలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీ జీవన్సురజ్సింగ్, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ కుశాల్కర్, పోలీస్స్టేషన్లో సీఐ నవీన్, ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో ట్రాఫిక్ సీఐ శ్రీశైలం, వైద్య డివిజన్ కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్వో జయలక్ష్మి, గాంధీనగర్కాలనీలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, పార్టీ కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఫరూఖ్నగర్ మండలంలో ఆయా గ్రామాల్లో ఆయా సర్పంచులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, వైస్ ఎంపీపీ మౌనిక, ఎంపీడీవో వినయ్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నె కవితనారాయణ, మాజీ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్ వెంకట్రాంరెడ్డి, సర్వర్పాషా, కొందూటి మహేశ్వరి, విశాల, ప్రేమలత, పావని, కౌసల్య, పీఏసీఎస్ చైర్మన్ బక్కన్నయాదవ్, ఎంఈవో శంకర్రాథోడ్, సీడీపీవో నాగమణి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
కేశంపేట మండల పరిషత్ కార్యాలయం ఎదుట జాతీయ జెండాను ఎంపీడీవో రవిచంద్రకుమార్ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వై.రవీందర్యాదవ్ పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు. కొత్తూరు మున్సిపాలిటీలో చైర్మన్ లావణ్యదేవేందర్, మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఎంపీపీ మధుసూదన్రెడ్డి, నందిగామ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఎంపీపీ ప్రియాంకగౌడ్ జెండాను ఎగురవేశారు.
కడ్తాల్ : మండల కేంద్రంతోపాటు పరిధిలోని ఆయా గ్రామాలు, తండాల్లో గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే జైపాల్యాదవ్, బ్రిలియంట్ స్కూల్ వద్ద ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ మురళీకృష్ణ, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, పోలీస్స్టేషన్ వద్ద ఎస్ఐ హరిశంకర్గౌడ్, పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, బురుజు కోట వద్ద ఉప సర్పంచ్ రామకృష్ణ, పీఏసీఎస్ కార్యాలయం వద్ద చైర్మన్ వెంకటేశ్గుప్తా, వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద ఏవో శ్రీలత, పశువైద్యశాల వద్ద వైద్యాధికారి భానునాయక్, గాంధీజీ విగ్రహం వద్ద శాయిరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పిప్పళ్ల వెంకటేశ్, అంబేద్కర్ విగ్రహం వద్ద నర్సింహ, మాల మహనాడు ఆధ్వర్యంలో భిక్షపతి, వివేకానంద యూత్ ఆధ్వర్యంలో మాధవులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
ఆమనగల్లులో.. ప్రభుత్వ దవఖాన వద్ద ఎమ్మెల్యే జైపాల్యాదవ్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో ఫారూఖ్హుస్సేన్, పోలీస్స్టేషన్ వద్ద సీఐ ఉపేందర్, వ్యవసాయ మార్కెట్ వద్ద చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ కార్యాలయం వద్ద పత్యానాయక్ జాతీయ జెండాలను ఎగురవేశారు.
తలకొండపల్లిలో.. తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో శ్రీకాంత్, ప్రాథమిక వ్యవసాయ సహకార కార్యాలయం వద్ద పీఏసీఎస్ చైర్మన్ కేశవరెడ్డి జాతీయ జెండాలను ఎగురవేశారు.
మాడ్గుల్లో.. మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ దేవుజానాయక్, పోలీస్స్టేషన్ వద్ద సీఐ కృష్ణమోహన్, సింగిల్విండో కార్యాలయం వద్ద చైర్మణ్ తిరుమల్రెడ్డి, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో రాఘవులు జాతీయ జెండాలను ఎగురవేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, ఎంపీడీవో రామకృష్ణ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, ఏఎంసీ, పీఏసీఎస్ డైరెక్టర్లు, వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, వివిధ పార్టీల, యువజన, కుల సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంబృందం : నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. ఇబ్రహీంపట్నం కోర్టు ఆవరణలో న్యాయమూర్తులు, మున్సిపల్ కార్యాలయం దగ్గర కమిషనర్ యూసఫ్, ఏసీపీ కార్యాలయంపై ఏసీసీ ఉమామహేశ్వర్రావు, ఇబ్రహీంపట్నం మార్కెట్యార్డుపై చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, అటవీ శాఖ డివిజన్ కార్యాలయంపై రేంజ్ ఆఫీసర్ విష్ణువర్ధన్, మండల పరిషత్ కార్యాలయంపై ఎంపీడీవో జైరాంవిజయ్, తహసీల్దార్ కార్యాలయంపై తహసిల్ధార్ రామ్మోహన్రావు, ఆర్టీసీ డిపోపై డీఎం, వ్యవసాయశాఖ డివిజన్ కార్యాలయంపై ఏడీఏ సత్యనారాయణలు జెండా ఎగురవేశారు. అలాగే, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, పెద్దఅంబర్పేట్, ఆదిబట్ల మున్సిపాలిటీలలో ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపీడీవోలు, కమిషనర్లు జెండాలు ఎగురవేశారు. డివిజన్ పరిధిలోని అన్ని పంచాయతీ కార్యాలయాలపై ఆయా గ్రామాల సర్పంచ్లు జాతీయ జెండాలను ఎగురవేశారు.
యాచారం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ సుచరిత, మండల పరిషత్కార్యాలయం వద్ద ఎంపీడీవో విజయలక్ష్మి, పోలీస్స్టేషన్ వద్ద సీఐ లింగయ్య, ప్రభుత్వ దవాఖాన ఎదుట వైద్యాధికారి ప్రియాంక, తమ్మలోనిగూడాలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధశాఖల అధికారులు, యువజన సంఘాల నాయకులు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.
మంచాల మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయలో తహసీల్ధార్ అనిత, మండల పరిషత్ కార్యాలయ ఎంపీడీవో శ్రీనివాస్, రైతు వేదిక భవనంపై ఏవో జ్యోతిశ్రీ, పోలీస్స్టేషన్ ఆవరణలో సీఐ వెంకటేష్గౌడ్, ఆరుట్ల, మంచాల ప్రభుత్వ దవాఖానల్లో వైద్యాధికారి కిరణ్ ప్రసాద్, విద్యుత్ కార్యాలయంలో ఏఈ సత్యరారాయణ సహకార సంఘం కార్యాలయ చైర్మన్ బుస్సు పుల్లారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు చీరాల రమేశ్, వివిధ గ్రామ పంచాయతీల వద్ద సర్పంచ్లు జెండాలు ఆవిష్కరించారు.