పరిగి, డిసెంబర్ 27: ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం నుంచి జనవరి 6వ తేదీ వరకు అభయహస్తం, మహాలక్ష్మీ, గృహలక్ష్మీ, యువ వికాసం, ఇందిరమ్మ ఇం డ్లు, రైతు భరోసా, అభయహస్తం చేయూత తదితర పథకాలకు దరఖాస్తులు స్వీకరించ నున్నట్లు పరిగి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. వార్డుల పరిధిలో ఏర్పాటుచేసిన స్థలాల్లో దరఖాస్తులు స్వీకరించాలని ఆయన అధికారులకు సూచించారు. కాగా ప్రజాపాలన కార్యక్రమ వివరాలను పరిగి మండల అభివృద్ది అధికారి శేషగిరిశర్మ తెలిపారు.
గురువారం బర్కత్పల్లి, రుక్కుం పల్లి, పోల్కంపల్లి, పేటమాదారం, నారా యణ పూర్, లక్ష్మీదేవిపల్లి, శుక్రవారం మాధారం, తొండపల్లి, యాబాజీగూడ, చిగురాల్పల్లి, గోవిందాపూర్, శనివా రం నజీరాబాద్తాండ, షోండేపూర్, రంగంపల్లి, మల్కాయ్పేట్తాండ, హీర్యానా యక్తండా, జనవరి 2వ తేదీ నస్కల్, రూప్ఖాన్పేట్, రాపోల్, 3వ తేదీ గడిసింగాపూర్, సయ్యద్పల్లి, మిట్టకోడూర్, 4వ తేదీ చిట్యాల్, నర్స య్యగూడ, సయ్యద్మల్కాపూర్, రాఘవాపూర్, ఖుదావంద్ పూర్, రావులపల్లి, 5వ తేదీన ఇబ్రహీంపూర్, రూప్సింగ్తాండ, జాఫర్పల్లి, కాళ్లాపూర్, సుల్తాన్పూర్, 6వ తేదీన లఖ్నాపూర్, సాలిప్పలబాటతాండ, రంగాపూర్ గ్రామాల్లో ప్రజాపాలన సదస్సులు నిర్వహించనున్నుట్టు పేర్కొన్నారు.
వికారాబాద్: ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు, ప్రజా ప్రతిని ధులందరు కలిసి విజయవంతం చేయాలని జడ్పీ డిప్యూటీ సీఈవో సుభాషిణి తెలిపారు. బుధవారం వికారాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ చంద్రకళ అధ్యక్షతన ప్రజా పాలన పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు సమయ పాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నిర్దేశించిన జాబితా మేరకు గ్రామాలకు వెళ్లి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్తయ్య, ఎంపీవో నాగరాజు, కో ఆప్షన్ సభ్యులు ఎర్రవల్లి జాఫర్, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
బొంరాస్పేట: ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి ప్రభుత్వం గురువారం నుంచి నిర్వహించే ప్రజా పాలనను ప్రజలు, ప్రజా ప్రతినిధులు విజయవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి రాంరెడ్డి కోరారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలనపై నిర్వహించిన సన్నాహాక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామసభల్లో దరఖాస్తుల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని, మంచినీరు సౌకర్యం, టెంటు వేయాలని, మహిళలు, పురుషులు, దివ్యాంగులు, వృద్ధులకు వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
గ్రామ సభకు ఒకరోజు ముందుగానే ఆయా గ్రామాల్లో ప్రజలకు దరఖాస్తులు అందించాలని, నిరక్షరాస్యుల దరఖాస్తులు పూర్తి చేయడానికి అధికారులు సహకరించాలని సూచించారు. గ్రామసభల నిర్వహణకు ప్రతి గ్రామానికి రూ.10 వేలు ప్రభుత్వం మంజూరు చేస్తున్నదని రాంరెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకన్గౌడ్, బొంరాస్పేట, దుద్యాల తహసీల్దార్లు వెంకటేశ్, దానయ్య, డీటీ రవి, వైద్యాధికారి హేమంత్, ఎస్సై శంకర్, ఎంపీటీసీ నారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.
మర్పల్లి: మండలంలో నేటి నుంచి ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించనున్నట్లు డీఎల్పీవో అనిత తెలిపారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, టీఏలు, ఐకేపీ సీసీలతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో తహసీల్దార్ గణేశ్, ఎంపీడీవో రాజమల్లయ్య రెండు టీంలతో నేటి నుంచి వచ్చేనెల 6 వరకు గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు తీసుకుంటామన్నారు.. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గణేశ్, ఎంపీడీవో రాజ మల్లయ్య, ఏపీవో అంజిరెడ్డి, ఈసీ విఠల్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు
తాండూరు రూరల్: నేటి నుంచి తాండూరు మండలంలో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 28వ తేదీన చింతా మణిపట్టణం, పర్వతాపూర్, చిట్టిఘనాపూర్, చంద్రవంచ, వీరారెడ్డిపల్లి, రాంపూర్ మీది తండాల్లో గ్రామ సభలు జరుగనున్నాయి. 29న గుంతబాసుపల్లి, మిట్టబాసుపల్లి, నారా యాణపూర్, వీర్శెట్టిపల్లి, ఖాంజాపూర్, అంతారంతండాల్లో సభలు జరుగనున్నాయి. 30న గౌతాపూర్, అల్లాపూర్, చెంగోల్, సంకిరెడ్డిపల్లి, అంతారం, బిజ్వార్ గ్రామా ల్లో సభలు నిర్వహించరున్నారు. జనవరి 2న బెల్కటూర్, ఓగిపూర్, కరణ్కోట గ్రామా ల్లో జరుగనున్నాయి. 3వ తేదీన సంగంకలాన్, మల్కాపూర్, కోటబాసు పల్లి, కొత్లాపూర్ కుర్ధు గ్రామాల్లో జరుగుతాయి. 4వ తేదీన చెన్గేష్పూర్, గోనూర్, జినుగుర్తి, ఐనెల్లి, 5వ తేదీన ఉద్దండాపూర్, గుండ్లమడుగుతండా, ఎల్మకన్నె, సిరిగిరిపేట గ్రామాల్లో గ్రామ సభలు జరుగనున్నాయి.
ధారూరు: ప్రజా పాలనలో భాగంగా నేటి నుంచి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ధారూరు మండల ప్రత్యేక అధికారి మల్లేశం బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ధారూరు మండలంలో 32 గ్రామ పంచాయితీలకుగాను ఎంపీడీవో, తహసీల్దార్ రెండు బృందాలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గురువారం ఉదయం మోమిన్ఖుర్దు,గడ్డమిది ంగారం, మధ్యాహ్నం రాజాపూర్, నర్సాపూర్, శుక్రవారం ఉదయం రాంపూర్, గురుదోట్ల, మధ్యా హ్నం గట్టేపల్లి, అంపల్లి, 30న ఉదయం ధారూరు, నాగసముందర్, మధ్యాహ్నం అవుసుపల్లి, అల్లాపూర్లో సభలు జరుగనున్నాయి.
వచ్చే నెల 2న ఉదయం కెరెళ్లి, నాగారం, మధ్యాహ్నం అల్లీపూర్, పులిచింతల మడుగు తండా, 3న ఉదయం మోమిన్కలాన్, దోర్నాల్, మధ్యాహ్నం అంతారం, ధారూరు స్టేషన్, 4న ఉదయం తరిగోపుల, మున్నూర్ సోమారం, మధ్యాహ్నం నాగుసాన్పల్లి,ఎబ్బనూరు, 5న ఉదయం మైలారం, చింతకుం ట, మధ్యాహ్నం కుమ్మరిపల్లి, హరిదాస్పల్లి, 6న ఉదయం కోండాపూర్కలాన్, కుక్కింద, మధ్యాహ్నం ధర్మాపూర్, రుద్రారం గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు మండల ప్రత్యేక అధికారి మల్లేశం తెలిపారు.
మోమిన్పేట: నేటి నుంచి ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో సదస్సులు నిర్వహించాలని ఎంపీడీవో శైలజా రెడ్డి అన్నారు. బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అధికా రులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రజా పాలన సమావేశలపై అవగాహన కల్పించారు. ఆరు గ్యారెంటీలకు ఒకే దరఖాస్తు ఫారంలో స్వీకరిస్తారని ఇందుకు కావలసిన పత్రాలను ప్రజలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, ఏవో భూపతి, ఎంపీవో యాదగిరి,పంచాయతీ కార్యదర్శులు పాల్గోన్నారు.
కులకచర్ల: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సత్య హరిశ్చంద్ర అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమావేశంలో మండల ప్రత్యేక అధికారి సరళాదేవి మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా గ్యారెంటీ స్కీముల దరఖాస్తుల స్వీకరణ కార్యక్ర మాన్ని సక్రమంగా నిర్వహించాలన్నారు. కేటాయించిన గ్రామాల్లో కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించాలని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ అంశాలను సర్పంచులకు, ఎంపీటీసీలకు, పంచాయతీ కార్యదర్శులకు, మండల స్థాయి అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నాగవేణి, కులకచర్ల తహసీల్దార్ మురళీధర్, చౌడాపూర్ తహసీల్దార్ ప్రభు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
పరిగి టౌన్: నేటి నుంచి ప్రారంభమయ్యే ప్రజాపాలన కార్యక్రమంపై మండల పరిధిలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, సంబంధిత శాఖ అధికా రులతో బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా పాలన కార్యక్రమానికి ప్రజాప్రతి నిధులు అందరూ హాజరు కావాలని, ఎవ్వరికీ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీపీ అరవింద్రావు సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ హరి ప్రియారెడ్డి. వైస్ ఎంపీపీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
దోమ: ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీలకు ఒకే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉన్నట్లు గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు ప్రజలకు వివరించాలని మండల అభివృద్ది అధికారి జయరాం,ఎంపీపీ అనసూయ అన్నారు. దోమ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాల యంలో గురువారం మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు ఆయా శాఖల అధికారుల ప్రజాప్రతినిధులకు ప్రజాపాలన సదస్సులపై అవగాహన కల్పించినట్లు వారు పేర్కొన్నారు.