మొయినాబాద్ : రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలో సురంగల్ గ్రామానికి చెందిన రాకంచర్ల వరలక్ష్మి ఏర్పాటు చేసిన ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ఆగ్రో రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతుందని తెలిపారు. రైతులకు పంట పెట్టుబడి సాయం అందించిన తరువాత బీడు భూములు కూడా సాగులోకి వచ్చాయని తెలిపారు. రైతులు చనిపోతే వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, మాజీ జడ్పీటీసీ కొంపల్లి అనంతరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, సర్పంచ్లు మనోజ్కుమార్, రత్నం, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మోర శ్రీనివాస్, ఎంపీటీసీలుల మల్లేశ్, రవీందర్రెడ్డి, రాంరెడ్డి, మాజీ సర్పంచ్ రాంచంద్రయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, రావూఫ్, సీనియర్ నాయకులు కొత్త నర్సింహ్మరెడ్డి, దారెడ్డి కృష్ణారెడ్డి, షాబాద్ దర్శన్, మాణెయ్య, రాములు, రవియాదవ్, దారెడ్డి వెంకట్రెడ్డి, అవుసుల భాస్కర్చారి, ఈగ రవీందర్రెడ్డి, మహేందర్రెడ్డి, సురేందర్గౌడ్, గడ్డం వెంకట్రెడ్డి, అంజనేయులుగౌడ్, శంకరయ్య, గడ్డం అంజిరెడ్డి, స్వామి, సీతారాంరెడ్డి, మాదవరెడ్డి పాల్గొన్నారు.