చేవెళ్ల టౌన్ : విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి పాఠశాలకు మంచిపేరు తీసుకరావాలని పర్యావరణ అవార్డు గ్రహీత రామకృష్ణారావు తెలిపారు. స్ట్రీట్ కాజ్ వాసవి కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో చేవెళ్ల మండల కేంద్రంలోని కస్తూర్భా పాఠశాలలో బాలికలకు లైబ్రరీ, బుక్స్, యుక్త వయస్సులో ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలి అని దానిపై అవగాహన కల్పించారు. అనంతరం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి ప్యాన్లు, చేవెళ్ల డిగ్రీ కళాశాల, పరిగి డిగ్రీ కళాశాలలకు అకాడమిక్ బుక్స్ అందచేయడంతో పాటు చన్వల్లి, పామెన ప్రాథమిక పాఠశాలలకు ఆట వస్తువులు దాతల సహకారంతో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చేయతనిచ్చేందుకు దాతలు ముందుకు రావలన్నారు.
కార్యక్రమంలో వాసవి కాలేజీ డివిజన్ ప్రెసిడెంట్ మౌనుష్క, అసోసియేట్ ప్రెసిడెంట్ మనింద్ర, వైస్ ప్రెసిడెంట్ జశ్వంత్, జనరల్ సెక్రెటరీ మేఘన, సింధుజ, కీర్తి, హిమజ, ప్రియాంక, కౌశిక్, కస్తూర్భా పాఠశాల ప్రిన్సిపాల్ శ్వేత, ఉపాధ్యాయురాలు, విద్యార్థినులు ఉన్నారు.