మొయినాబాద్ : విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ వివిధ రంగాల్లో రాణించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని అజీజ్నగర్ గ్రామ రెవెన్యూలో ఉన్న హైదరాబాద్ పొలో అండ్ హార్స్ రైడింగ్ క్లబ్ నిర్వహించిన హార్స్ రైడింగ్ జూనియర్ విభాగంలో రెండు వందల మంది రైడర్స్లో చేగూరి రితీష్గౌడ్ తమ సత్తాను చాటి మొదటి స్థానంలో నిలిచాడు. వారితో పాటు వివిధ విభాగంలో గెలుపొందిన రైడర్స్లకు శుక్రవారం రాత్రి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి షీల్డ్ బహుకరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి రైడర్స్కు షీల్డ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడారంగంలో విద్యార్థులు వారు పెట్టుకున్న లక్ష్యం వైపు పరుగులు తీయాలని పేర్కొన్నారు.
ఇలాంటి క్లబ్ హైదరాబాద్ నగరానికి అతి చేరువలో ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకుని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని సూచించారు. హార్స్ రైడింగ్లో ధైర్య సహాసాలు కూడా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో హైదరాబాద్ పొలో అండ్ హార్స్ రైడింగ్ క్లబ్ ప్రిన్సిపాల్ ఖాదర్ సిద్ధికి, సెక్రెటరీ రియాజ్ హైమద్ పాల్గొన్నారు.