కొత్తూరు రూరల్ : ఆరుతడి పంటలవైపు రైతులు మొగ్గు చూపాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని ఏనుగులమడుగు తాండలో మంగళవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతరెడ్డి పర్యటించారు. రైతులతో మాట్లాడుతూ ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. వరికి బదులుగా ఆరుతడి పంటలు వేయడం వల్ల రైతులకు మంచి లాభాలు వస్తాయని తెలిపారు.
ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ ఏడీ రాజరత్నం, మండల వ్యవసాయశాఖ అధికారి గోపాల్, సర్పంచ్ అరుణ, ఎంపీటీసీ పత్లవత్ డాకి, ఏఈవో దీపిక, గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు.