మొయినాబాద్ : రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని, రోడ్డు ఇరుకుగా ఉండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని విజ్ఞప్తి చేస్తూ నాగిరెడ్డిగూడ సర్పంచ్ సురేందర్గౌడ్, అజీజ్నగర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ శ్రీశైలంలు శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్రావును కలిసి వినతి పత్రం అందించారు. శుక్రవారం హైదరాబాద్లోని మంత్రి నివాసానికి వెళ్లి వినతిపత్రం అందించారు.
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి నుంచి వయా అజీజ్నగర్ మీదుగా నాగిరెడ్డిగూడ గ్రామం వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టి బీటీ రోడ్డుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి ఎరబెల్లి దయాకర్రావు స్పందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రోడ్డు పనులు చేపట్టే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నట్లుగా వారు తెలిపారు. విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారని వారు చెప్పారు.