కొడంగల్ : శాసన మండలి సభ్యులుగా ఎన్నికైనా బండ్ల ప్రకాష్, పట్నం మహేందర్రెడ్డిలను కొడంగల్ నియోకవర్గ ముదిరాజ్ నాయకులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని వారి వారి నివాసంలో ఎమ్మెల్సీలను కలిసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు నర్సింలు, వెంకటయ్య, ఎంట్ల మల్లయ్య, బాల్రాజ్, నరేశ్రాజ్, ప్రకాశ్ పాల్గొన్నారు.