ఆమనగల్లు : ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను ఎమ్మెలీ కసిరెడ్డి నారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు. గురువారం శాసనమండలి సభ్యుడిగా రెండవసారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి సీఎంను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలందించాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు ఎమ్మెల్సీ పేర్కొన్నారు.