చేవెళ్ల టౌన్ : లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా కేసుల పరిష్కారానికి సులువైన మార్గం లభిస్తుందని జూనియర్ సివిల్ జడ్జి జీవన్ సూరజ్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం చేవెళ్ల కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. పెండింగ్లో ఉన్న పలు కేసులు ఇరువురి రాజీతో పరిష్కరించబడ్డాయి. జూనియర్ సివిల్ జడ్జి జీవన్ సూరజ్ సింగ్ మాట్లాడుతూ లోక్ అదాలత్తో విలువైన కోర్టు సమయం వృథా కాకుండా ఇరు వర్గాల వారు రాజీ పడడంతో సులువుగా కేసుల పరిష్కారం జరుగుతుందన్నారు.
ప్రతి ఒక్కరూ క్షణికావేశంలో చేసిన తప్పులను తిరిగి పునరావృతం కాకుండా చూడాలని, కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, పాండురంగారెడ్డి, లీగల్ హెడ్ సురేశ్, చంద్రశేఖర్, గౌతంరెడ్డి, బాలస్వామి, జైపాల్, శంకర్పల్లి సీఐ మహేశ్రెడ్డి, షాబాద్ సీఐ అశోక్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.