కోట్పల్లి : ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే మీతో నేను కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రాంపూర్లో మీతో నేను కార్యక్రమంలో భాగంగా ఉదయం 7గంటల నుంచి గ్రామంలోని కాలనీల్లో స్థానిక సర్పంచ్ అనితాగోపాల్రెడ్డితో పాటు పలువురు అధికారులతో కలిసి పర్యటించి, ప్రజల సమస్యలను, జరిగిన అభివృద్ది విషయాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు పరుస్తుందని, రైతులకు పంట పెట్టబడి నుంచి పంట చేతికోచ్చే వరకు అన్ని సదుపాయాలను కల్పించి రైతులకు న్యాయం చేస్తుందన్నారు.
అనంతరం హనుమాన్ మందిర్ వద్ద ఏర్పాటు చేసిన గ్రామ ప్రజల సమావేశంలో ప్రజలకు ఉన్న సమస్యలు, కావల్సిన పనులపై మాట్లాడారు. కొంతమంది రైతులు పొలాలకు పార్మాషన్ రోడ్డు ఇబ్బందులు ఉన్నాయని, పార్మాషన్ రోడ్డు వేస్తే మాకు పొలాలకు దారులు బాగుంటాయని ఎమ్మెల్యే దృష్టికి తెగా వేయిస్తామని అన్నారు. రైతులకు అన్ని రకాలుగా ఆదుకునేందుకు ముందుటామని భరోసా ఇచ్చారు. గ్రామంలో మిషన్ భగీరథ తాగునీరుపై అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో విద్యుత్ సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు విద్యుత్ డీఈ, ఏఈలకు ఫోన్ ద్వారా సమస్యలను వినిపించారు. అట్టి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
మరి కొంతమంది పింఛన్ల గురించి అడుగగా త్వరలోనే వస్తాయని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అనితాగోపాల్రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, మండల అధ్యక్షుడు అనిల్కుమార్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్యాదవ్, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.