ఇబ్రహీంపట్నంరూరల్ : ఒగ్గు కళాకారుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం శాస్త్రా గార్డెన్లో రంగారెడ్డి జిల్లాస్థాయి ఒగ్గు కళాకారుల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశ్, కుర్మసంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేష్లు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అన్ని వర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. గత ప్రభుత్వాల హయంలో అంతరించిపోయిన ఒగ్గు కళాకారులను టీఆర్ఎస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిందన్నారు.
కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో గొల్లకుర్మలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ఉచిత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పెద్ద ఎత్తున గొరెలను పంపిణీ చేశారన్నారు. ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశ్ మాట్లాడుతూ ఒగ్గు కళాకారులు డోలు వాయిస్తే పండుగ వాతావరణం నెలకొంటుందన్నారు. డోలు చప్పులు, గజ్జెల మోతలు అంటే ముఖ్యమంత్రి ఎంతో అమితమైన ప్రేమ అని అన్నారు. రానున్న రోజుల్లో గొల్లకుర్మలు ఆర్థికంగా ఎదిగేందుకు అందరూ కలిసిరావాలన్నారు.
కార్యక్రమంలో కుర్మసంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, ఒగ్గుకళాకారుల సంఘం అధ్యక్షుడు ఐలయ్య, ప్రధాన కార్యదర్శి శేఖర్, మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, కుర్మసంఘం నాయకులు కాల్లె గణేష్, చీరాల రమేశ్, పొట్టి రాములు, కొత్తకుర్మ శివకుమార్, ఐలయ్య, మల్లేష్, జంగయ్య, ఐలయ్య, జగన్ పాల్గొన్నారు.