కడ్తాల్ : పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన శ్రీనివాస్రెడ్డికి రూ. 72వేలు, సాయికుమార్గౌడ్కి రూ. 35వేలు, నర్సింహాగౌడ్కి రూ. 18వేలు, చరికొండ గ్రామానికి చెందిన ప్రమీలకి రూ. 18వేలు, సుకునమ్మకి రూ. 12వేలు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు వరంలా మారిందని, ఈ పథకంతో పేదలకు కార్పొరేట్ దవాఖానలో అత్యుత్తమ వైద్యం అందుతున్నదని తెలిపారు. సబ్బండ వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నదని వివరించారు.
ఎమ్మెల్సీకి సన్మానం… ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డిని శుక్రవారం టీఆర్ఎస్ నాయకులు సన్మానించారు.
కేఎన్ఆర్ యువసేన జిల్లా అధ్యక్షుడు నరేశ్నాయక్ ఆధ్యర్యంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీకి పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ గోపాల్రెడ్డి, నాయకులు సురేందర్రెడ్డి, కొండల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, లక్ష్మయ్యగౌడ్, భీష్మాచారి, బాల్రాజ్, లక్పతినాయక్, టీకులాల్నాయక్, జాన్యానాయక్, చిన్నాగౌడ్, వెంకటయ్య, అయిలయ్య, మోత్యానాయక్, జంగయ్య పాల్గొన్నారు.