తుర్కయాంజాల్ : తుర్కయాంజల్ మున్సిపాలిటీ 21వ వార్డు శ్రీరాంనగర్లోని రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ కుమారుడు కొత్తకుర్మ యశ్వంత్ ఆధ్వర్యంలో గురువారం మహాపడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జేఏసీ చైర్మన్ కోదండరాం, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధరాంరెడ్డి, వైస్ చైర్పర్సన్ గుండ్లపల్లి హరితధన్రాజ్ గౌడ్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్లు కొశిక ఐలయ్య, రమావత్ కళ్యాణ్ నాయక్, కౌన్సిలర్లు కుంట ఉదయశ్రీగోపాల్రెడ్డి, గుండా భాగ్యమ్మధన్రాజ్, తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వాములకు బిక్ష పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.