ఇబ్రహీంపట్నం, జూలై 18: ఈ నెల 24న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రజాప్రతినిధులు, నాయకులు సిద్ధమయ్యారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. మంత్రి బర్త్డేకు ముందురోజు 23వ తేదీన ఒకేరోజు లక్ష మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఈ మేరకు మంచాల మండలంలోని కాగజ్ఘాట్- జాపాల మధ్యలో ఉన్న అటవీ ప్రాంతంలో గుంతల తవ్వకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
అడవుల సంరక్షణలో భాగంగా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఒకేరోజు లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి అటవీశాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. మంచాల మండలంలోని కాగజ్ఘాట్- జాపాల మధ్యలో ఉన్న అటవీ ప్రాంతంలో లక్ష మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో అటవీశాఖతోపాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. ఈనెల 24న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక్కరోజు ముందుగా అనగా ఈ నెల 23వ తేదీన ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. హరితహారంలో భాగంగా చేపట్టే ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, పాఠశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులతోపాటు ఉపాధి హామీ కూలీలు పాల్గొననున్నారు.
గతేడాది మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో తులేకలాన్ అటవీప్రాంతంలో లక్షమొక్కలు నాటే కార్యక్రమాన్ని జయప్రదంగా చేపట్టగా… ఈ ఏడాది జాపాల అటవీ ప్రాంతాన్ని వారు ఎంచుకున్నారు. అంతరించి పోతున్న అడవులను సంరక్షించేందుకు ఆయన మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చు ట్టగా.. గతేడాది నాటిన మొక్కలు ఏపుగా పెరిగా యి. ఈ ఏడాది కూడా లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫలాలిచ్చే మొక్కలపైనే ప్రత్యేక దృష్టి..
అటవీశాఖ ఆధ్వర్యంలో జరుగనున్న లక్షమొక్కలు నాటే కార్యక్రమంలో ఎక్కువగా ఫలాలిచ్చే సీతాఫలం, అల్లనేరేడు, జామ, రాగి, చీమచింత తదితర మొక్కలను నాటేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా వన నర్సరీల్లో ఈ మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే మొక్కలను నాటేందుకు గోతులు తీసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలి
మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని హరితహారంలో భా గంగా ఈ నెల 23న నిర్వహించ తలపెట్టిన లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని శాఖల అధికారులతోపాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు ప్రతి ఒక్కరూ
పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.
–మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే
ఏర్పాట్లు చేస్తున్నాం
మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని జాపాల- కాగజ్ఘా ట్ అటవీ ప్రాంతంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే మొక్కలను నాటేందుకు ఉపాధిహామీ సిబ్బంది తో గోతులను తీయిస్తున్నాం. ఒకే రోజు లక్ష మొక్కలను నాటేందుకు లక్ష గోతులు తీయించే కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది.
–విష్ణువర్ధన్, అటవీశాఖ రేంజ్ అధికారి