చాంద్రాయణగుట్ట, జూలై 6: లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయం తరుఫున ఢిల్లీలో మూడు రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ బోనాల జాతర బుధవారం అట్టహాసంగా ముగిసింది. చివరి రోజు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి హజరై కేంద్ర ప్రభుత్వం తరుఫున అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. కేంద్ర టూరిజం శాఖ డైరెక్టర్ కమలవర్ధన్ అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మంద జగన్నాథం అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఫోర్మేన్ కమిటీ చైర్మన్ రాజ్కుమార్, సభ్యులు చెన్నబోయిన శివకుమార్ యాదవ్, పోసాని సురేందర్ ముదిరాజ్, ప్రతినిధులు ఏ. మాణిక్ప్రభుగౌడ్, కే.విష్ణుగౌడ్, కాశీనాథ్గౌడ్, బి.బల్వంత్ యాదవ్, లక్ష్మీనారాయణగౌడ్, కళాకారుల బృందం సభ్యులు నీరజ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.