ధారూరు, జూలై 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వ హిస్తున్న తెలంగాణ హరిత హారం కార్యక్రమానికి పల్లెల్లో జోరుగా పనులు సాగుతున్నాయి. పల్లెలు పచ్చదనంతోఉండేందు కు ప్రజాప్రతినిధులు, అధి కారులు నాయకులు ఎంతో శ్ర మిం చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తు న్నారు. జిల్లాలోనే ధారూరు మండలాన్ని ఆదర్శ మండలంగా గుర్తింపు తెచ్చేందుకు అధికార యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. మండల పరిధిలోని 32 గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కలు సిద్ధం గా ఉంచారు. ప్రతి పల్లె నర్సరీలో 17వేలు మొక్కలు(టేకు, జామ, ఉసిరి, గచ్చకాయ, కానుగ, గులా బీ తదితర) పెంచి హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి.
అడవులను కాపాడాలి
రైతులు తమ పొలాల వద్ద, ఇంటి పరిసర ప్రాంతాల్లోను, రోడ్డుకు ఇరువైపులా, మొ క్క లు నాటి తెలంగాణను హరిత వనంగా తీర్చి దిద్దాలనే సంకల్పం ఎంతగానో నచ్చింది. హరి తహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేం దుకు రైతులందరూ ఉద్యమంలా ముందుకు వచ్చారు. అంతరించి పోతున్న అటవీ సంపద ను కాపాడడం అందరి బాధ్యత.
– సుజాత, సర్పంచ్ దోర్నాల్
రైతుల సహకారంతో..
రైతుల సహకారంతో కార్యక్ర మాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. హరితహారం కార్య క్రమంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షిం చుకునే బాధ్యత ప్రతి రైతు తీసుకోవాలి. వై కుంఠధామం, కంపోస్టు షెడ్ల చుట్టూ గచ్చ కాయ మొక్కలను నాటించాం. గచ్చకాయ మొ క్కలు పెరిగి కంచెగా తయారు అవుతుంది. దీం తో కంచె వేసే అవసరం ఉండదు.
-శ్రీనివాస్ టీఏ, ఉపాధి హామీ పథకం
మొక్కలు సిద్ధం
హరితహారం కార్యక్రమంలో భా గంగా నాటేందుకు మొక్కలు సి ద్ధంగా ఉన్నాయి. మండలం లో ని ప్రతి గ్రామ నర్సరీల్లో హరితహారం కార్య క్రమానికి అన్ని ఏర్పాట్లు చేశాం. మండల పరిధిలోని ప్రతి గ్రామ నర్సరీలో రకరకాల మొక్కలు పెంచి రైతులకు అందుబాటులో ఉం చాం. నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకునే బాధ్యతప్రతి ఒక్కరూ తీసుకోవాలి.
– షఫీఉల్లా, ఎంపీవో ధారూరు