ఇబ్రహీంపట్నం, జూలై 3:తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యమే పరామావధిగా వైద్య సేవలను మెరుగుపర్చుతున్నది. 30 పడకలు ఉన్న ఇబ్రహీంపట్నం ఏరియా దవాఖానకు నిత్యం రోగుల సంఖ్య పెరుగుతుండడంతో వైద్యవిధాన పరిషత్లోకి మార్చింది. దీంతో 50 పడకలను ఏర్పాటు చేసి కార్పొరేట్కు దీటుగా నిరంతర వైద్య సేవలను అందించేందుకు ప్రత్యేక వైద్య సిబ్బందిని సైతం నియమించనున్నది. ఈ వైద్యశాలకు ప్రస్తుతం నిత్యం 500 నుంచి 1000 మంది వరకు రోగులు వస్తున్నారు. అంతేకాకుండా యాచారం మండల కేంద్రంలోని దవాఖాననూ వైద్యవిధాన పరిషత్లోకి తీసుకున్నది. ఈ దవాఖానల్లో ల్యాబ్లను ఏర్పాటు చేసి ఎలాంటి వ్యాధులైనా ఇక్కడే పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నది.
ఇబ్రహీంపట్నం ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందుకు అనుగుణంగా ఇబ్రహీంపట్నం ఏరియా దవాఖాన స్థాయిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటి వరకు జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలో ఉన్న ఈ దవాఖాన ఇక నుంచి వైద్యవిధాన పరిషత్ పరిధిలోకి మారనున్నది. ఈ దవాఖానకు వచ్చే ఔట్పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ దవాఖాన స్థాయిని పెంచింది. ప్రస్తుతం 30 పడకలతో కొనసాగుతున్న ఈ దవాఖాన వైద్యవిధాన పరిషత్లోకి రావడంతో 50 పడకల దవాఖానగా మారడంతోపాటు సిబ్బంది సం ఖ్య కూడా గణనీయంగా పెరుగనున్నది.
24 గంటల పాటు కార్పొరేట్ దవాఖానలకు దీటు గా ప్రజలకు వైద్యసేవలు అందనున్నాయి. స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉండనున్నారు. ఇప్పటికే ప్రత్యేక వైద్యసిబ్బందితోపాటు వైద్యుల పోస్టులను కూడా పెం చారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం దవాఖానకు ప్రతిరోజూ ఐదువందల నుంచి వెయ్యి మంది ఓపీ పేషెంట్లు వస్తుండటంతోపాటు డెలివరీ కేసుల సంఖ్య కూడా పెరిగింది. మరో నెల రోజుల్లో ఈ దవాఖానలో పూర్తిస్థాయిలో వసతులు సమకూరనుండటంతోపాటు వైద్యసిబ్బందిని కూడా పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
దవాఖానల స్థాయి పెంపుతో కలిగే ప్రయోజనాలు..
ఇబ్రహీంపట్నం, యాచారం ప్రభుత్వ దవాఖానల స్థాయిని పెంచుతూ సర్కారు వైద్యవిధాన పరిషత్లోకి తీసుకోవడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ దవాఖానల్లో ప్రస్తు తం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, గర్భిణులకు వైద్యసేవలు మాత్రమే అందుతు న్నాయి. దవాఖానల స్థాయిని పెంచడం ద్వారా వైద్యులతోపాటు సిబ్బంది సంఖ్య కూడా పెరుగనున్నది. ఇబ్రహీంపట్నం దవాఖానలో 24 గంటలపాటు ప్రజలకు కార్పొరేట్ దవాఖానలకు దీటుగా వైద్యసేవలు అందనున్నాయి. స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉండనున్నారు. ఇబ్రహీంపట్నం, యాచారం దవాఖానల్లో షుగర్, బీపీ, థైరాయిడ్, కంటి, పన్ను, ముక్కు, చెవి తదితర పరీక్షలను నిర్వహించటంతోపాటు ఈసీజీ, స్కానింగ్, ఎక్స్రే, మూత్రం, రక్త పరీక్షలతోపాటు అన్ని రకాల వైద్యపరీక్షలను ఉచితంగా చేయనున్నారు.
కార్పొరేట్కు దీటుగా వైద్యం ..
ఇబ్రహీంపట్నం, యాచారం ప్రభుత్వ దవాఖానల స్థాయిని పెంచడం ద్వారా ఈ ప్రాంతంలోని నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందనున్నది. వైద్యసేవల కోసం ప్రజలు హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. వైద్యులు 24 గంటలపాటు అందుబాటులో ఉండనున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రెండు దవాఖానల స్థాయిని పెంచడం అభినందనీయం. -మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే
దవాఖానల స్థాయి పెంపు హర్షణీయం
గతంలో ప్రజలు ప్రభుత్వ దవాఖానలకు వెళ్లాలంటే భయపడేవారు. ప్రభుత్వ దవాఖానల్లో సరైన వైద్య సదుపాయాలు ఉండేవి కావు. కానీ,
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రత్యేక చొరవతో రెండు దవాఖానల స్థాయిని పెం చడం హర్షణీయం. ఇక నుంచి నిపుణులైన వైద్యసిబ్బందితోపాటు 24 గంటలపాటు ప్రజలకు మెరుగైన వైద్యం అందనున్నది. –విజయ్కుమార్, ఇబ్రహీంపట్నం