తలకొండపల్లి, డిసెంబర్ 23 : పండ్లతోటల పెంపకంపై రైతులు దృష్టి సారించాలని ఉద్యానవనశాఖ అధికారి ఉషారాణి అన్నారు. గురువారం తలకొండపల్లి గ్రామంలో రైతులు విఠల్, నర్సమ్మ, యాదగిరి సాగుచేసిన బొప్పాయి తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు పండ్లతోటల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని ఇస్తుందన్నారు. హైద్రాబాద్ పట్టణానికి తలకొండపల్లి మండల రైతులు దగ్గరగా ఉన్నారని, తోటల పెంపకానికి ఇక్కడి భూములు అనువుగా ఉన్నట్లు పేర్కొన్నారు. తోటలపెంపకంలో యాజమాన్య పద్ధతులు పాటిస్తూ సేంద్రియ ఎరువులు వాడాలని సూచించారు. దీంతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. తోటలకు తెగుళ్లు రాకుండా ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో రైతులు విఠల్, యాదగిరి, తిరుపతి, అలివేలు ఉన్నారు.