తలకొండపల్లి, మే 26 : ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని చీపునుంతల గ్రామంలో శివ, సీతారామ ఆంజనేయస్వామి వారి ఆలయ నిర్మాణ పనులను గురువారం మాజీ ఎంపీ మల్లు రవితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవభక్తిని అలవర్చుకోవాలన్నారు. చీపునుంతల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి, జడ్పీటీసీ వెంకటేశ్, ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్, సర్పంచ్ రఘుపతి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నరోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.