ఇబ్రహీంపట్నం, మే 22 : ఇబ్రహీంపట్నం నియోజవకర్గంలో వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్పార్టీ విజయబావుటా ఎగురవేస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్మెట్ మండలం బండరావిరాల, చిన్నరావిరాల గ్రామాలకు చెందిన వందమంది ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కిషన్రెడ్డి వారికి టీఆర్ఎస్ జెండాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారన్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీల తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మలేకపోతున్నారని, వచ్చే ఎన్నికల్లో కూడా ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా టీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. బండరావిరాల, చిన్నరావిరాల గ్రామాల్లో కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి దీటుగా ఈ గ్రామాల ప్రజలు టీఆర్ఎస్లో చేరారు. నియోజకవర్గంలో త్వరలోనే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కిషన్గౌడ్, నాయకులు శ్రీనివాస్, మహేందర్, గణేశ్, శేఖర్రెడ్డి, జంగయ్య, బసవయ్య, దయాకర్రెడ్డి, భాస్కర్, అర్జున్, భూపాల్, కిరణ్, నర్సింహ పాల్గొన్నారు.
భక్తి భావాన్ని అలవర్చుకోవాలి
ప్రజలందరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధి ఖానాపూర్ గ్రామంలో శ్రీసీతారామచంద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగవంతుని కృపతో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఈ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, కౌన్సిలర్లు శంకరయ్య, మమత, నాయకుడు వేణుగోపాల్రావు, ఆలయ కమిటీ సభ్యులున్నారు.
నిరుపేదలకు కొండంత అండగా సీఎంఆర్ఎఫ్
ఇబ్రహీంపట్నంరూరల్, మే 22 : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గ పరిధిలో పలువురు లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను ఆదివారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. యాచారం మండలం చింతపట్లకు చెందిన లక్ష్మికి రూ.2.50లక్షలు, తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని శాంతకుమార్కు రూ.44వేలు, ఎలిమినేటి అనితకు రూ.42వేలు మంజూరయ్యాయి. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రమేశ్గౌడ్, మధుకర్, నర్సింహారెడ్డి, వెంకటయ్య, దాసు, బాషా, సంగీత, స్వాతి, అమరేందర్రెడ్డి, మోహన్, శివ, మహేందర్ ఉన్నారు.