ధారూరు, మే 22: మండలంలోని కోట్పల్లి ప్రాజెక్టు ఆదివారం పర్యాటకులతో సందడిగా మారింది. వేసవి సెలవులు కావడంతో ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన వారు కుటుంబ సభ్యులతో కలిసి అధిక సంఖ్యలో తరలివచ్చారు. విద్యార్థులు, యువకులు సెల్ఫీలు, ఫొటోలు దిగి.. బోటింగ్ చేసేందుకు అధిక ప్రాధాన్యమిచ్చారు. కాసేపు సరదాగా ప్రాజెక్టు నీటిలో ఆడిపాడి ఎంజాయ్ చేశారు. సాయంత్రం సమయంలో కుటుంబసభ్యులతో కలిగి తిరి గి వారి వారి ప్రాంతాలకు తరలివెళ్లారు. కాగా ప్రాజెక్టు పరిసరాల్లో ఎలాం టి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.