కేశంపేట, ఏప్రిల్ 30 : అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం అధికారులు ముస్లింలకు రంజాన్ తోఫా దుస్తులు, మహిళలకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల అభివృద్ధ్దికి సంఘాల ద్వారా ప్రభు త్వం 5 లక్షల నుంచి 20 లక్షల దాకా తక్కువ వడ్డీకి రుణాలను అందజేస్తుందని, మహిళలు రుణాలను సద్వినియో గం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. రాష్ట్రంలో అన్ని మతాల పండుగలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నా రు. అనంతరం మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ పనిముట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్యాదవ్, జడ్పీటీసీ విశాల, వైస్ ఎంపీపీ అనురాధ, తాసిల్దార్ మురళీకృష్ణ, సర్పంచ్, ఎంపీటీసీలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
30 పడకల దవాఖాన నిర్మాణానికి స్థల పరిశీలన
మండల కేంద్రంలో నూతనంగా 75 లక్షల రూపాయలతో నిర్మించనున్న 30 పడకల దవాఖాన నిర్మాణానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ శనివారం స్థలాన్ని పరిశీలించారు. ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో నూతన భవనాన్ని నిర్మిస్తే అనుకూలంగా ఉంటుందన్నారు. భవన నిర్మాణ శంకుస్థాపనకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు రానున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్యాదవ్, జడ్పీటీసీ విశాల, సర్పంచ్లు వెంకట్రెడ్డి, నవీన్కుమార్, విష్ణువర్ధన్రెడ్డి, కృష్ణయ్య, ఎంపీటీసీ మల్లేశ్యాదవ్, మాజీ ఎంపీపీ, జడ్పీటీసీలు విశ్వనాథం, నర్సింగ్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.