చేవెళ్ల టౌన్, జూలై 6 : పల్లెలు, పట్టణాల సమగ్రాభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని మల్లారెడ్డి గూడలో సర్పంచ్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెలను దేశానికి అదర్శంగా నిలుపాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, ముడిమ్యాల పీఏసీఎస్ వైస్ చైర్మన్ మల్లేశ్, ఎంపీటీసీ రవీందర్ ఉన్నారు.
హరిత తెలంగాణే లక్ష్యంగా కృషి
షాబాద్, జూలై 6 : హరిత తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని జడ్పీటీసీ అవినాశ్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని నాగరగూడ, లక్ష్మరావుగూడ, తిమ్మారెడ్డిగూడ, ఎట్ల ఏర్రవల్లి, మక్తగూడ గ్రామాల్లో పర్యటించారు. అనంతరం పల్లెప్రగతి, హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. పల్లె ప్రగతితో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో టీఎల్ఎఫ్ జిల్లా లీగల్ అడ్వయిజర్ సతీశ్రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నర్సింహులుగౌడ్, వైస్ చైర్మన్ మల్లేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్రావు, సర్పంచులు కృష్ణాగౌడ్, అనితారెడ్డి, శకుంతల, అనిత, ఎంపీటీసీ సునీత, నాయకులు రాజేందర్రెడ్డి, మహేందర్గౌడ్, సుధాకర్గౌడ్, కిష్టయ్య, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
హరితహారంలో భాగస్వాములు కావాలి
షాద్నగర్టౌన్, జూలై 6 : హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ నరేందర్ అన్నారు. మున్సిపాలిటీలోని 20వ వార్డులో ఆర్డీవో రాజేశ్వరి, కమిషనర్ లావణ్య, కౌన్సిలర్ మహేశ్వరితో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. నాటే ప్రతి మొక్క భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుందన్న విషయాన్ని గ్రహించాలన్నారు.
కొనసాగుతున్న పల్లె ప్రగతి
షాద్నగర్రూరల్, జూలై 6 : ఫరూఖ్నగర్ మండలంలోని గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మండలంలోని చింతుగూడ, బూర్గుల, కాశీరెడ్డిగూడలో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజ ఇద్రీస్ అహ్మద్ సర్పంచ్లతో కలిసి హరితహారంలో పాల్గొన్నారు. నాటిన ప్రతి మొక్కనూ కంటికి రెప్పలా కాపాడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు కల్పనరామ్, దీనశంకర్, అరుణశివకుమార్, ఎంపీటీసీ లక్ష్మీనర్సింహ, నాయకులు అనంద్, గోవింద్రెడ్డి పాల్గొన్నారు.
గ్రామాలు సుందరంగా మారాలి
కొందుర్గు, జూలై 6 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు సుందరంగా మారాలని డీఎల్పీవో సురేశ్బాబు అన్నారు. మండలంలోని మహాదేవ్పూర్ గ్రామంలో పల్లె ప్రగతిలో చేపట్టిన పనులను పరిశీలించారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి విడుదల చేస్తున్న నిధులను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో లాలయ్య,కార్యదర్శి యాదయ్య పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం
కేశంపేట, జూలై 6 : హరితహారంలో ప్రతి పౌరుడు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఎంపీపీ రవీందర్యాదవ్ అన్నారు. మండలంలోని కాకునూరు, సుందరాపురంలో హరితహారంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్నాయక్, సర్పంచ్లు లక్ష్మమ్మ, రాములునాయక్, నవీన్కుమార్, వెంకట్రెడ్డి, ఎంపీటీసీలు రమాదేవి, యాదయ్య, జడ్పీటీసీ విశాల, పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీధర్రెడ్డి, యూత్ విభాగం అధ్యక్షుడు మురళీమోహన్, నాయకులు శ్రావణ్రెడ్డి, యాదగిరిరావు, శేఖర్పంతులు పాల్గొన్నారు.
ఎక్కువ మొక్కలు నాటాలి..
కొత్తూరు, జూలై 6 : ఎక్కువ మొక్కలు నాటి హరిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య, కౌన్సిలర్లతో కలిసి మంగళవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ర్టాన్ని హరితమయంగా మార్చాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని కోరారు. తిమ్మాపూర్ నుంచి నందిగామ వరకు హైవేకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. చైర్ పర్సన్ లావణ్య మాట్లాడుతూ మొక్కలు నాటి పెంచాల్సిన బాధ్యత ఇంటి మహిళలు తీసుకోవాలన్నారు.
సమీకృత మార్కెట్కు శంకుస్థాపన..
పట్టణంలో బయోటెక్ వెంచర్లలో ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్కెట్ను ఎమ్మెల్యే అంజయ్యయావ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యాపారులు, రైతులు అందరూ తాత్కాలిక మార్కెట్లో కూరగాయలు క్రయవిక్రయాలు చేసుకోవాలన్నారు. అతి త్వరలో రూ. 2 కోట్లతో మార్కెట్ను నిర్మించి ఇస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వీరేందర్, ప్రత్యేక అధికారి సుకీర్తి, కౌన్సిలర్లు, తహసీల్దార్ వెంకట్రామ్రెడ్డి, సీఐ శ్రీధర్, మేనేజర్ మంజులత పాల్గొన్నారు.
ప్రజలు భాగస్వాములు కావాలి
చేవెళ్లటౌన్, జూలై 6 : పల్లె ప్రగతిలో భాగంగా దామరిగిద్ద సర్పంచ్ వెంకటేశం గుప్తా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల, పంచాయతీ కార్యాలయం, అంగన్వాడీ అవరణలో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ చొరవతో గ్రామంలో ఎల్వీ ప్రసాద్ దవాఖాన ఆధ్వర్యంలో ప్రజలకు కంటి వైద్యపరీక్షలు నిర్వహించారు.
చేవెళ్లలో..
పల్లెప్రగతిలో భాగంగా చేవెళ్ల పంచాయతీ కార్యాలయంలో వివిధ పాఠశాల విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు సర్పంచ్ శైలజ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోటీలో 14 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులకు సర్పంచ్ బహుమతులు అందజేశారు.
ఇంటింటికీ మొక్కల పంపిణీ
నందిగామ, జూలై 6 : మండల కేంద్రంలో సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి ఇంటింటికీ ఐదు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి, నాయకుడు బాల్రెడ్డి పాల్గొన్నారు.
అభివృద్ధి కోసమే ప్రగతి పనులు
శంకర్పల్లి, జూలై 6 : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మున్సిపాలిటీలో ప్రత్యేకాధికారి ప్రభాకర్ మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మితో కలిసి వార్డుల్లో ప్రగతి పనులను పరిశీలించారు. 11వ వార్డులో ఏర్పాటు చేసిన నర్సరీని సందర్శించారు. అనంతరం 9వ వార్డులో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ యాదగిరి పాల్గొన్నారు.