కడ్తాల్, డిసెంబర్ 13 : మండల పరిధిలోని సాలార్పూర్ గ్రామ సమీపంలో ఏర్పాటు చేయనున్న మైనింగ్కు పర్యా వరణ అనుమతుల కోసం అధికారులు మంగళవారం ప్రజా భిప్రాయ సేకరణ చేపట్టారు. సాలార్పూర్ గ్రామ సమీ పంలోని సర్వే నంబర్ 97లోని 10.266 హెక్టార్లలో రఫ్ స్టోన్, రోడ్డు మెటల్ గని ఏర్పాటు చేసేందుకు, మెస్సెర్స్ వజ్రం ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకులు భూమిని లీజుకు తీసుకు నేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆర్డీవో సూరజ్కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లా కాలుష్య నియంత్రణ బోర్డు ఈఈ వెంకట నర్సు, తహసీల్దార్ మురళీకృష్ణ, ఎంపీడీవో రామకృష్ణ, సీఐ ఉపేందర్, ఎస్ఐలు హరిశంకర్గౌడ్, సుందరయ్య, వెంకటేశ్యాదవ్, ఎంపీవో మధుసూదనాచారి పాల్గొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో సాలార్పూర్, రేకులకుంట తండా, చల్లంపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు హాజర య్యారు. మైనింగ్ ఏర్పాటుపై ప్రజాప్రతినిధులు, నాయకులు, తండావాసులు, యువ కులు, మహిళలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను ప్రభుత్వానికి నివేదిస్తానని ఆర్డీవో తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయలక్ష్మి, ఎంపీటీసీ ప్రియ, ఉప సర్పంచ్ శ్రీశై లం, నాయకులు శంకర్నాయక్, పంతూనాయక్, వాహిద్, ప్రకాశ్, రాజేందర్, తిరుపతి, జగన్, మల్లేశ్ పాల్గొన్నారు.