ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 13 : గ్రంథాలయాల సేవలను మారుమూల పల్లెలకు విస్తరించడానికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. ఇటీవల నూతనంగా నియమితులైన జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ను కలిశారు. జిల్లా గ్రంథాలయసంస్థ కార్యకలాపాలపై ఈ సందర్భంగా సమీక్షించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విరివిగా వెలువడుతున్న నేపథ్యంలో నిరుద్యోగ యువతకు ఉపయోగపడే విధంగా మరిన్ని పుస్తకాలు సమకూర్చాలని సూచించారు. గ్రంథాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చొరువ తీసుకోవాలని చెప్పారు. జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచనల మేరకు పైలట్ ప్రాజెక్టుగా ప్రజా పఠన కేంద్రాలయాలను జిల్లాలో ఏర్పాటు చేసే విధంగా రూపొందించిన ప్రణాళికలను వేగవంతంగా అమలు చేయాలన్నారు. నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయించాలన్నారు. వేసవికల్లా గ్రంథాలయ భవనాలన్నింటినీ అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నూతనంగా ఎన్నికైన గ్రంథాలయ కమిటీ సభ్యులతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని, ప్రణాళికలు రూపొందించుకుని ముం దుకు సాగుదామని అన్నారు. జిల్లా గ్రంథాలయసంస్థ కార్యదర్శి మనోజ్కుమార్, లైబ్రేరియన్ సత్యనారాయణ, శరత్ తదితరులు పాల్గొన్నారు.