తుర్కయాంజాల్, డిసెంబర్ 10 : వైశాలి కుటుంబానికి అండగా ఉంటామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి మన్నెగూడ సిరి టౌన్షిప్లో నివాసం ఉంటున్న వైశాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నవీన్రెడ్డి స్నేహితులతో కలిసి ఇంటిపై దాడిచేసి వైశాలిని కిడ్నాప్ చేయడం హేయమైన చర్య అన్నారు. కిడ్నాప్ ఘటనను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. నవీన్రెడ్డితో పాటుగా ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసకోవాలని ఆయన పోలీసులకు సూచించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అంతకుముందు ఆయన నవీన్రెడ్డి స్నేహితుల దాడిలో గాయపడి కాలువిరిగిపోయిన పోరెడ్డి శేఖర్రెడ్డిని నివాసానికి వెళ్లి పరామర్శించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ సంజీవరెడ్డి, బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వేముల అమరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంచిరెడ్డి మచి మనస్సు
తుర్కయాంజాల్/ పెద్దఅంబర్పేట : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి గొప్ప మనస్సు చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు భరోసా ఇచ్చారు. దిల్సుఖ్నగర్కు చెందిన బండారి మహేశ్ అనే యువకుడు, ముసారంబాగ్కు చెందిన పానుగంటి ప్రతీక్ అనే 14 ఏండ్ల బాలుడు శనివారం సంఘీనగర్ రోడ్డులో బైక్పై వెళ్తూ అదుపుతప్పి కిందపడ్డారు. రక్తపు గాయాలతో రోడ్డు పక్కన డివైడర్పై కూర్చుని ఉన్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి రోడ్డు పక్కన కూర్చున్న క్షతగాత్రులను చూసి కాన్వాయ్ ఆ పి.. నేరుగా క్షతగాత్రుల వద్దకు వెళ్లి నీళ్ల బాటిల్ అందించారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకున్నారు. వెంటనే వైద్య సాయం అందేలా చర్యలు చేపట్టాలని అబ్దుల్లాపూర్మెట్ సీఐ స్వామిని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించి, వైద్యం అందేలా చర్యలు చేపట్టారు.