కులకచర్ల, నవంబర్ 27: గ్రామాలు హరిత అందాలను సంతరించుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంతో పల్లెపల్లెన వన సంపద పెరిగింది. స్వచ్ఛమైన ప్రాణవాయువు, పర్యావరణంలో సమతుల్యతకోసం సీఎం కేసీఆర్ తెలంగాణకు హరితహా రం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొక్కలు నాటడమే కాదు, అవి వృక్షాలయ్యే వరకు పెంచాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. గ్రా మాలతోపాటు రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపు గా పెరిగి ప్రయాణికులు, పాదచారులు, గ్రామస్తులకు ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. మండలంలో 44 గ్రామ పంచాయతీలు ఉండగా హరితహారం కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆదేశాల మేరకు పక్కాగా నిర్వ హిస్తున్నారు. ప్రతి గ్రామానికీ నర్సరీని ఏర్పాటు చేసి.. దాని సంరక్షణ కోసం ప్రత్యేక నిధులను ప్రభుత్వం కేటాయిస్తున్నది. అంతేకాకుండా గ్రామాల్లో ఇంటింటికీ ఐదు మొక్కల చొప్పున పంపిణీ చేసి వాటిని నాటి సంరక్షించాలని ప్రజలకు ప్రభుత్వం సూచించడంతో ప్రతి ఇంటి ఎదుట మొ క్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నాయి. జిల్లాలోని అన్ని గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటడంతోపాటు రోడ్లకు ఇరువైపులా కూడా మొక్కలను నాటి సంరక్షించాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కల పెంపకాన్ని భారీ స్థాయిలో చేపట్టా రు. దీంతో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి రోడ్లు పచ్చందాలను సంతరించుకున్నాయి. బీటీ రోడ్లతోపాటు గ్రామాల్లోని రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు పెద్దగా పెరిగి చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
గ్రామంలో పచ్చదనం సంతరించుకున్నది
ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రా మంలోని రోడ్లకు ఇరువైపులా చాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం సంతరించుకున్నది. ఈ చెట్లు రోడ్లపై రాకపోకలు సాగిస్తున్న వారికి ఆహ్లాదాన్ని కలిగించడమే కాకుండా వేసవిలో ప్రయాణికులకు నీడ ను కూడా ఇస్తున్నాయి. హరితహారంతో గ్రామాలు హరిత గ్రామాలుగా, రోడ్లు హరిత రహదారులు మారాయి.
-సౌమ్యావెంకట్రాంరెడ్డి, గ్రామ సర్పంచ్ కులకచర్ల
మొక్కలను సంరక్షిస్తున్నాం
గ్రామంలోని రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటి సం రక్షిస్తున్నాం. వాటికి గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా ప్రతిరోజూ నీటిని అందిస్తున్నాం. దీంతో అవి ఏపు గా పెరిగి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. -శ్రీనివాస్రెడ్డి,పంచాయతీ కార్యదర్శి కులకచర్ల