షాద్నగర్టౌన్, నవంబర్ 24: పట్టణంలో ఏర్పాటు చేయనున్న బటర్ఫ్లై లైటింగ్ ఏర్పాటుతో మున్సిపాలిటీ మరింత సుందరంగా మారనుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణ ముఖ్యకూడలి పరిగిరోడ్డు మధ్యలో ఏర్పాటు చేయనున్న బటర్ఫ్లై లైట్స్ ఏర్పాటు పనులను గురువారం మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కమిషనర్ వెంకన్న, ఆర్టీసీ డీఎం సురేఖ, కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీలో సీసీరోడ్లు, వీధి దీపాలు, అంతర్గత మురుగు కాలువలతో పాటు ఇంటింటికీ మిషన్భగీరథ నల్లాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రోడ్డు మధ్య లో ఏర్పాటు చేయనున్న బటర్ఫ్లై లైట్స్తో మున్సిపాలిటీ సుందరంగా మారనుందని అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములుకావాలన్నారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్లు బచ్చలి నర్సింహ, వెంకట్రాంరెడ్డి, జీ.టీ శ్రీనివాస్, నాయకులు శంకర్, యాదగిరి, సత్యం, ఆర్టీసీ ఉద్యోగులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.