కడ్తాల్, సెప్టెంబర్ 23 : మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని, ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ కానుక చరిత్రాత్మకమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంబీఏ గార్డెన్స్లో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్ అధ్యక్షతన మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలను అందజేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ఆడపడుచులకు సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారని, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదని అన్నారు. ఉమ్మడి పాలకులు మహిళల సంక్షేమాన్ని, భద్రతను గాలికొదిలేశారని విమర్శించారు. మహిళలకు అందించే బతుకమ్మ చీరలపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలోని మహిళలకు రూ.340 కోట్లతో 240 రకాల బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. కల్వకుర్తి-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.
అనంతరం ఆసరా పింఛన్ దారులకు కార్డులను పంపిణీ చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తెస్తున్నదని, కేంద్రంలోని బీజేపీ పార్టీ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి, ప్రజల మధ్యన దూరాన్ని పెంచి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న పార్టీకి ప్రజలే తగిన సమయంలో గుణపాఠం చెబుతారన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, మండల అధ్యక్షుడు వీరయ్య, ఎంపీటీసీలు గోపాల్, లచ్చిరాంనాయక్, శ్రీనివాస్రెడ్డి, ప్రియ, మంజుల, సర్పంచ్లు కృష్ణయ్యయాదవ్, తులసీరాంనాయక్, సులోచన, భారతమ్మ, భాగ్యమ్మ, పూజ, రవీందర్, ఉప సర్పంచ్లు రామకృష్ణ, ఎల్లాగౌడ్, వెంకటేశ్, వినోద్, లాయక్అలీ, భిక్షపతి, రామచంద్రయ్య, వెంకటేశ్, బాలకృష్ణ, ఎంపీడీవో రామకృష్ణ, ఆర్ఐ నారాయణ, ఏవో శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
మాడ్గుల : కాట్రగాని తండా, కొర్రతండా, గుడితండా, రాజీవ్ నగర్ తండా, అప్పరెడ్డిపల్లి గ్రామస్తులు వైస్ ఎంపీపీ శంకర్ నాయక్తో కలిసి ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు వినతిపత్రం అందజేశారు. సర్వే నెంబర్ 66, 78, 116, 95లో లావణి పట్టాభూములను కొన్ని సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు కొంత మంది అక్రమంగా పట్టా చేయించుకున్నారని ఎమ్మెల్యేకి వివరించారు. కార్యక్రమంలో రఘు, లాలు, మోతీలాల్, దేవు, చంద్రు, లక్ష్మణ్ పాల్గొన్నారు.