యాచారం, జూలై 1: రాష్ర్టాభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని కిషన్పల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యే సమక్షంలో శుక్రవారం టీఆర్ఎస్లో చేరారు. నూతనంగా పార్టీలో చేరినవారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో భారీగా చేరుతున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్లు ఎన్ని కుట్రలు చేసినా సాగవన్నారు. అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. దేశంలోనే ప్రతి రంగంలో రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్కు శ్రీరామ రక్ష అని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జంగమ్మ, మాల్ ఎంపీటీసీ ఇస్రత్బేగం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు యాదయ్య, శివ, సుభానీ తదితరులు పాల్గొన్నారు.