కడ్తాల్, జూలై 1: పంటల సాగుపై రైతులకు మండల వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె మండల కేంద్రంలోని రైతువేదికలో మహేశ్వరం డివిజన్ వ్యవసాయ శాఖ అధికారులకు జరి గిన శిక్షణా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ గురించి జిల్లా వ్యవసాయ కార్యాలయ ఏడీఏ నివేదిత కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల మండలాల ఏఈవోలకు శిక్షణా కార్యక్రమంలో వివరించారు.
మండలాల్లో వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించే కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు యాప్లో నమోదు చేయాలని ఏఈవోలకు సూచించారు. అనంతరం గీతారెడ్డి మాట్లాడుతూ వానకాలం-2022కు సం బంధించి పచ్చిరొట్టె ఎరువుల వాడకం, వరి విత్తనాలను నేరుగా వెదజల్లే విధానం, భాస్కరాన్ని కరిగించే బ్యాక్టీరియా ఉపయోగం, విడుతల వారీగా ఎరువుల వాడకం, అధిక సాంద్రతతో ఉన్న పత్తిని సాగు చేయడంపై అధికారులు రైతులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. పత్తి, కంది పంటల సాగును పెంచేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మహేశ్వరం ఏడీఏ సుజాత, మల్లికార్జునస్వామి, ఏవోలు శ్రీలత, అరుణకుమారి, లావణ్య, యాదగిరి, నాగమణి, నాలు గు మండలాల ఏఈవోలు పాల్గొన్నారు.
మంచాల, జూలై 1: కంది, పత్తి పంటల సాగును పెంచేలా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి అన్నా రు. శుక్రవారం ఆమె మంచాల గ్రామంలోని రైతువేదికలో ఇబ్రహీంపట్నం డివిజన్ స్థాయి వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గీతారెడ్డి మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని అన్ని క్లస్టర్లలో కంది, పత్తి పంటల సాగును పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
భాస్కరాన్ని కరిగించే బ్యాక్టీరియా ఉపయోగాన్ని రైతులకు వివరించాలని సూచిం చారు. అదేవిధంగా పంటల నమోదు కోసం ప్రభుత్వం కొత్తగా రూపొందించిన యాప్ గురించి అధికారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏడీఏ సత్యనారాయణ, నివేదిత, ఏవో మల్లికార్జున్, జ్యోతిశ్రీ, అన్ని మండలాల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.