యాలాల : యాలాల, విశ్వనాథ్పూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ఎన్పోర్స్మెంట్ డీటీ పద్మతో కలిసి ఎంపీపీ బాలేశ్వరగుప్తా బుధవారం పరిశీలించారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యంలోని తేమను ఎలా గుర్తిస్తున్నారని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట కొనుగోళ్లను ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా తూకం వేసి, ఆన్లైన్లో రైతు విక్రయించిన పంటను నమోదు చేయాలన్నారు. రైతులు దలారుల బారిన పడకుండా వరి కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని విక్రయించాలన్నారు.
ఏ-గ్రేడ్ రకానికి రూ. 1960, బీ-గ్రేడ్ రకానికి రూ. 1940 ప్రభుత్వ మద్దతు ధరతో కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నట్లు వారు తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ మద్దతు ధరతో వరి ధాన్యాన్ని సేకరిస్తున్నామన్నారు.