మొయినాబాద్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను గురువారం ఎమ్మెల్యే కాలె యాదయ్య పరిశీలించారు. మండలంలో మొత్తం ఎన్ని ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి, ఏమేమి పనులు చేయిస్తున్నారు అని సంబంధిత అధికారులను అడిగారు. నర్సరీలలో పనులు చేస్తున్న వాచ్లకు డబ్బులు సక్రమంగా వస్తున్నాయా అని అడిగారు. నెలలో కొద్దిగా ఆలస్యం అయినా నెల నెల వస్తున్నాయని, ఎవరికి పెండింగ్ పెట్టకుండ వేతనాలు ఇస్తున్నామని అధికారులు చెప్పారు. వారితో పాటు ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, ఉన్నారు.