మంచాల జూన్ 23 : హరితహారం విజయమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఎంపీపీ నర్మద అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ, వ్యవపాయ శాఖ, అటవీ శాఖ, ఏపీవో, కార్యదర్శులతో హరితహారంపై సమీక్షా సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. హరితహారంలో అధికారులు సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. మండలంలో లక్షా 5వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
మండలాన్ని అగ్రస్థానంలో నిలుపాలి
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఏడో విడుత హరితహారం మొక్కలు నాటడంలో మండలాన్ని అగ్రస్థానంలో నిలుపాలని ఎంపీపీ కృపేశ్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్లు, ఎంపీటీసీలతో పాటు ఆయా శాఖల అధికారులతో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆదేశాల మేరకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. మండలంలోని గ్రామాల్లో శ్మశాన వాటికలు, పొలంగట్లు, డంపింగ్యార్డులు, చెరువుగట్లు, రోడ్లకిరువైపులా, అటవీ ప్రాంతాలతో పాటు మిగతా ఇతర ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో మహేశ్బాబు, ఏఈ ఇంద్రసేనారెడ్డి, ఎంఈవో వెంకట్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు భరత్రెడ్డి పాల్గొన్నారు.
హరితహారంపై నిర్లక్ష్యం వద్దు
హరితహారాన్ని నిర్లక్ష్యం చేయయకుండా సమష్టిగా విజయవంతం చేయాలని ఎంపీపీ అనిత కోరారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీడీవో వెంకట్రాములు ఆధ్వర్యంలో హరితహారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ పంచాయతీలకు చెందిన ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. ఎంపీడీవో వెంకట్రాములు మాట్లాడుతూ 75వేల మొక్కలను టార్గెట్గా చేసుకున్నామన్నారు. సమావేశంలో సూపరింటెండెంట్ రమేశ్నాయక్, ఏఈ కృష్ణ య్య, సీడీపీవో సక్కుబాయి, ఎంఈవో సర్దార్నాయక్, ఏపీ వో మాధవ్రెడ్డి, ఏపీఏం కృష్ణయ్య, సర్పంచులు మల్లమ్మ, లచ్చీ, బల్రాం, సోనా, ఎంపీటీసీ సరిత పాల్గొన్నారు.
విజయవంతంగా నిర్వహించాలి
మండలంలో హరితహారాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఎంపీపీ సుకన్య అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తించి గుంతలు తీయించాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో పాల్గొన్నారు.