రంగారెడ్డి, మే 16,(నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేదుకుగాను రాష్ట్ర ప్రభు త్వం పదిరోజుల పాటు లాక్డౌన్ ప్రకటించింది. అయితే జిల్లాలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోడ్లపై తిరుగుతున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప ట్టించుకోకుండా రోడ్లపైకి వస్తున్నారు. అత్యవసరం ఉన్నవారు, కుటుంబంలో ఒక్కరూ మా త్రమే బయటకు రావాలని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా వినిపించుకోవడం లేదు. మీరు నిర్లక్ష్యంగా తిరగడం వల్ల మీ ప్రాణాలకే కాదు…మీ కుటుంబ సభ్యుల ప్రాణాలకు కూడా ముప్పు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచిస్తున్నారు. ఎవరైతే పట్టించుకోకుండా బయటకు వస్తారో సంబ ంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
జిల్లాలోని ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, ఆమనగల్ ప్రాంతాల పరిధిలో కొందరు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చారు. రోడ్లపైకి వచ్చిన వారికి పోలీసులు అవగాహన కల్పించడంతోపాటు పదే పదే సూచించినా వినకపోవడంతో ప్రభు త్వ ఆదేశాల మేరకు పలు వాహనాలను సీజ్ చేశారు. అత్యవసర స ర్వీసులు మి నహా మిగతా వారిని పోలీసులు సీరియస్గా హెచ్చరిస్తున్నారు.
జి ల్లాలో అనవసరంగా బయ ట తిరుగుతున్నా వారిని గుర్తించి జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 56 వాహనాలను స్వా ధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో 28 వాహనాలను, శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరి ధి లో 12 వాహనాలు, ఆమనగల్లు సర్కిల్ పరిధి లో 16 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా రహదారులపై చెక్పోస్టులు ఏర్పా టు చేసి నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులు అనుమతించిన ఈ-పాస్ ఉన్న వారితోపాటు అత్యవసర సర్వీసులను మా త్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. అయితే జిల్లా లోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా వాహనాలు బయటకు రాకుండా ప్రజలు ఇంట్లోనే ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
అంతేకాకుండా గ్రామాల్లోనూ సర్పంచులు స్వచ్ఛందంగా ముం దుకు వచ్చి పోలీసులకు సహకరిస్తూ గ్రామస్తులెవరూ బయటకు రాకుండా చూ సు కుంటు న్నారు. సడలింపు సమయంలో కూడా మార్కె ట్లో, దుకాణాల వద్ద ప్రజ లు గుంపులుగా చేరకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించే విధంగా అన్ని మున్సిపాలిటీల అధికారులతోపాటు దుకా ణాదారులు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు మెజార్టీ ప్రజలు ఇండ్లలోనే ఉంటూ కరోనా కట్టడిలో మేము సైతం అంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఆ నాలుగు గంటలు జాగ్రత్త..
లాక్డౌన్ దృష్ట్యా ప్రభుత్వం రోజుకు 4 గంటల సమయాన్ని సడలింపు ఇస్తూ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి 10 వరకు నిత్యావసర వస్తువుల కొనుగోలుతోపాటు ఇతర అవసరాలకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 20 గంటలు లాక్డౌన్ను అమలు చేస్తున్నారు.