పరిగి, ఆగస్టు 10 : హరిత తెలంగాణ సాధనే లక్ష్యంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. వజ్రో త్సవాల్లో భాగంగా బుధవారం పరిగి పట్టణ పరిధిలోని ఫ్రీడమ్ పార్కులో, మండ లం లోని సాలిప్పలబాటతాండలోని పార్కులో భారతదేశం ఆకారంలో మొక్కలు నాటా రు. పూడూరు మండలం మీర్జాపూర్లో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మహనీయులను స్మరించుకుంటూ వజ్రో త్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజు ఒక కార్యక్రమం చేపట్టడం ద్వారా జాతీయ సమైక్యతా స్పూర్తిని పెంపొందించడం జరుగుతుందని తెలిపారు. మహనీయులకు గుర్తుగా మొక్కలు నాటాలి మహనీయులకు గుర్తుగా ప్రతిఒక్కరు మొక్కలు నాటాలని డీసీసీబీ చైర్మన్ మనో హర్రెడ్డి అన్నారు. కులకచర్ల మండలం తిర్మలాపూర్ గ్రామంలో ఆయన మొక్కలు నాటారు. పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు మండలాల్లో జరిగిన ఫ్రీడమ్ పార్కుల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఎంపీపీలు కరణం అరవిందరావు, అనుసూజ, మల్లేశం, జడ్పీ టీసీలు కొప్పుల నాగారెడ్డి, మేఘమాల, రాందాస్నాయక్, పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు ఆంజనేయులు, శేరి రాంరెడ్డి, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, మండలాల రైతుబంధు సమితి అధ్యక్షులు పీరంపల్లి రాజు, రాజేందర్రెడ్డి పాల్గొన్నారు.
తాండూరు, ఆగస్టు 10: తాండూరు నియోజకవర్గంలో జాతీయ జెండాల పంపిణీ కార్య క్రమం ఉత్సాహంగా కొనసాగుతున్నది. బుధవారం నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండల పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికీ జెండాలను పంపిణీ చేశారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తాండూరులో చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు నిర్వహించిన తిరంగా ర్యాలీ ఆకట్టుకున్నది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా 75 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు, టీఆర్ఎస్ నేతలు తాండూరు పట్టణంలోని ప్రధాన రోడ్లపై భారత్మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వ హించారు. పట్టణంలోని దుకాణాలతో పాటు ఇంటింటికీ జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపా, టీఆర్ఎస్ నేతలు విఠల్ రెడ్డి, శ్రీశైల్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అఫ్పు నయీమ్, ముఖ్య నేతలు నర్సింహులు, శ్రీనివాస్ చారి, నరేందర్ గౌడ్, రాఘవేందర్, సిందూజా, సంగీత ఠాకూర్ పాల్గొన్నారు.
వికారాబాద్, ఆగస్టు 10: వికారాబాద్ నియోజక వర్గ పరిధిలోని ధారూరు, కోట్పల్లి, బంట్వారం, మర్పల్లి, మోమిన్పేట్, వికారాబాద్ మండలాల్లో బుధవారం జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఆయా మండల పరిధిలోని గ్రామాల్లో సర్పంచులు, నాయ కులు, ప్రజా ప్రతి నిధులు, అధికారులు 75 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. ధారూరు మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామంలో పల్లెప్రకృతి వనంలో 75 వసంతాలను సూచిస్తూ సర్పంచ్, గ్రామస్తులు, మొక్కలు నాటారు. అలాగే వికారాబాద్ మండల పరిధిలోని నారాయణ్పూర్ గ్రామంలో 75 వసంతాలను సూచిస్తూ సర్పంచ్, గ్రామస్తులు మొక్కలు నాటారు. బంట్వారం మండలంలో వజ్రోత్సవాల సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహించారు.
కొడంగల్/బొంరాస్పేట ఆగస్టు10: కొడంగల్ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు ఇంటింటిని సందర్శించి మువ్వన్నెల జాతీయ జెండాను పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి మొక్కలను నాటారు. తుంకిమెట్ల గ్రామంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. దేశానికి స్వాతంత్య్ర లభించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, రైతుబంధు మండలా ధ్యక్షుడు మహేందర్రెడ్డి, ఎంపీటీసీ తిరుపతయ్య, ఎంపీడీవో పాండు, ఏపీవో మల్లికా ర్జున్, టీఆర్ఎస్ నాయకులు దేశ్యానాయక్, మల్లేశ్గౌడ్, సలాం, జగన్ యాదవ్ పాల్గొన్నా రు. మెట్లకుంటలో సర్పంచ్ నారాయణ ఆధ్వర్యంలో 75 ఆకారంలో మొక్కలు నాటారు. చౌదర్పల్లిలో సర్పంచ్ వెంకటమ్మ, ఎంపీటీసీ నారాయణరెడ్డి ప్రజలకు త్రివర్ణ పతా కాలను పంపిణీ చేశారు. బాపల్లితండాలో త్రివర్ణ పతాకాలు చేతపట్టి ఎంపీపీ హేమీబాయి, హెచ్ఎం గోపాల్, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.కొడంగల్ మండలంలోని చిన్ననందిగామ గ్రామంలో సర్పంచ్ సావిత్రమ్మ, ఎం పీడీవో పాండులతో పాటు గ్రామస్తులు టీఆర్ఎస్ నాయకులు కలిసి బృహత్ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటి జెండాలను పంపిణీ చేశారు. పర్సాపూర్ గ్రా మంలో సర్పంచ్ సయ్యద్ అంజద్ త్యాగధనులను గుర్తు చేస్తూ ఇంటింటికీ జాతీయ పతాకాలను అందజేశారు.