ఇబ్రహీంపట్నం, ఆగష్టు 10 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, ఆదిబట్ల, మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని చర్లపటేల్గూడ గ్రామంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి వన మహోత్సవంలో పాల్గొని గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వాతంత్య్ర వజ్రోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. మండలాల్లోని పలు గ్రామాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు వన మహోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, వైస్ఎంపీపీ ప్రతాప్రెడ్డి, ఎంపీడీవో క్రాంతికిరణ్, ఎంఈవో వెంకట్రెడ్డితో పాటు ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.
షాబాద్ : స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ప్రజలందరూ ఘనంగా జరుపుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అదే విధంగా మొయినాబాద్ మండలం నజీబ్నగర్లో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. శంకర్పల్లిలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటారు. షాబాద్ మండలంలోని కక్కులూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ ఏడాది ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో వజ్రోత్సవాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీసీఈవో దిలీప్కుమార్, ఉపాధి హామీ అదనపు పీడీ నీరజ, ఆర్డీవో వేణుమాధవ్రావు, ఆయా మండలాల జడ్పీటీసీలు పట్నం అవినాశ్రెడ్డి, మర్పల్లి మాలతీ, కాలె శ్రీకాంత్, గోవిందమ్మ, ఎంపీపీలు మల్గారి విజయలక్ష్మి, కోట్ల ప్రశాంతిరెడ్డి, గునుగుర్తి నక్షత్రం, గోవర్ధన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, ఎంపీడీవోలు అనురాధ, రాజ్కుమార్, తహసీల్దార్ సైదులుగౌడ్, టీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్, నర్సింగ్రావు, మహేందర్రెడ్డి, గోపాల్, వాసుదేవ్కన్నా, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, కక్కులూర్ సర్పంచ్ మమత, ఎంపీటీసీ కరుణాకర్ పాల్గొన్నారు.
షాద్నగర్ : ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో ఫరూఖ్నగర్ మండలం కమ్మదనం గ్రామంలో మొక్కలు నాటారు. షాద్నగర్ మున్సిపాలిటీ ఈశ్వర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్క్ ను ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్ ప్రారంభించి మొక్కలను నాటారు. జాతీయ జెండాలతో ప్రదర్శన చేశారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. కేశంపేట మండల కేంద్రంలో ఎంపీపీ వై. రవీందర్యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా వజ్రోత్సవ వేడుకలను నిర్వహించారు. మొక్కలను నాటి ఐక్యతను చాటారు. కొత్తూరు, నందిగామ మండల కేంద్రాల్లో ఘనంగా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్తో పాటు పోలీస్ అధికారులు మొక్కలను నాటారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజ ఇద్రీస్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్. కేశంపేట జెడ్పీటీసీ తాండ్ర విశాలశ్రావణ్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్గౌడ్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి, వైస్ ఎంపీపీ అనురాధ, సర్పంచ్లు నవీన్కుమార్, జగన్నాయక్, ఎంపీటీసీ మల్లేశ్యాదవ్, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్ఖాన్, ఇన్చార్జి ఎంపీడీవో రవిచంద్రకుమార్రెడ్డి, విద్యుత్శాఖ ఏఈ వినోద్, టీఆర్ఎస్ నాయకులు మురళీధర్రెడ్డి, యాదగిరిరావు, విశ్వనాథం, పర్వత్రెడ్డి, తిరుమలరెడ్డి శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.