కడ్తాల్, జూన్ 29 : ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని, రైతుబంధు పథకంతో అన్నదాతలు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. రైతుబంధు పథకం డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుండటంతో బుధవారం కడ్తాల్, ఆమనగల్లు మండల కేంద్రాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేసి సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా నిలిచారన్నారు. రైతులు పండించిన పంటలను మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని కుల వృత్తులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. అనంతరం గ్రామంలో ఎడ్ల బండితో ఎమ్మెల్యే జైపాల్యదవ్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు దశరథ్నాయక్, అనురాధ, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ గిరియాదవ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వీరయ్య, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీలు గోపాల్, మంజుల, ఉప సర్పంచ్ రామకృష్ణ, నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు ప్రారంభం
మాడ్గుల : చంద్రయన్పల్లి గ్రామంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ రైతువేదిక, డంపింగ్యార్డ్, వైకుంఠధామం, సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం కల్లుగీత కార్మికులకు లైసెన్సులను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జైపాల్రెడ్డి, సర్పంచ్ యాదిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ శంకర్నాయక్, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.
కల్వర్టు నిర్మించాలని వినతి
ఆమనగల్లు : పెంటతండాకు వెళ్లే రహదారిలో వాగు వెళ్తుందని, దానిపై కల్వర్టు నిర్మించాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వినతిపత్రం అందజేశారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీనిచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్చంచ్ సాలయ్య, నాయకులు చంద్రూనాయక్,రమేశ్ పాల్గొన్నారు.