పూడూరు : సమాజంలో అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయవృత్తి ఎంతో గొప్పదని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పూడూరు మండల కేంద్రంలోని రైతువేదిక హాల్లో మండలస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంఈవో హరిచందర్ అధ్యక్షతన ఘనంగా సన్మానించి ప్రశాంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు నాణ్యమైన విద్యబోధన చేసే ఉపాధ్యాయులకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగినప్పుడు మొదట సంతోషించేది ఉపాధ్యాయుడేన్నారు.
ప్రతి ఉపాధ్యాయుడు తమ శక్తి వంచన మేరకు అంకిత భావంతో విధులు నిర్వహిస్తు ఉత్తమ బోధన చేసే ఉపాధ్యాయులకు సమాజంలో గుర్తింపుతో పాటు సన్మనాలు జరుగుతాయన్నారు. పాఠశాలల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. అనంతరం జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎంపికైన ఉపాధ్యాయులను సన్మానం చేశారు. ఉపాధ్యాయులు పాఠశాలల్లో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలోఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, మాజీ పీఏసీఎస్ సొసైటీ చైర్మన్ నిర్సింహ్మరెడ్డి, తాజొద్దీన్, ఉప సర్పంచ్ రాజేందర్, ఎంపీడీవో ఉష, వైస్ ఎంపీపీ మహిపాల్రెడ్డి, మండలలోని పలు సంఘాల నాయకులు ఎండి. జాగీర్, అంజిలయ్య, కుర్వ నర్సింహులు, రత్న, సుభాశ్, ఆంజనేయులు, ఎం. నర్సింహులు, మల్లేశం, మహేందర్రెడ్డి ఉపాధ్యాయులు ఉన్నారు.