2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2024కు స్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లావాసులు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది చివరి రోజు సందడిగా గడిపేందుకు ఇష్టపడుతున్నారు. పట్టణాల శివారుల్లోని ఫాం హౌస్లు, గెస్ట్ హౌస్లు, రిసార్టులను వేదికగా చేసుకుంటున్నారు. పేరుగాంచిన రిసార్టులు ఇప్పటికే బుక్ అయిపోగా.. చిన్నాచితక గెస్ట్హౌస్లు, ఫాం హౌస్లకు సైతం మస్తు డిమాండ్ ఉన్నది. కొందరు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు ఆధ్యాత్మిక క్షేత్రాల వైపు వెళ్లాలనుకుంటుండగా, మరికొందరు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఆసక్తి చూపుతున్నారు.
ఇంకొందరు తమ కాలనీల్లోనే కేక్లు కట్ చేసి పటాకులు కాల్చి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేలా ప్లాన్ చేసుకుంటున్నారు. – పెద్దఅంబర్పేట, డిసెంబర్ 30 వదినమ్మా అంతా రెడీ కదా. త్వరగా వచ్చేయండి. ఉదయమే వెళ్లిపోదాం. తినే వస్తువులు ఏమీ పట్టుకురావొద్దు. అంతా అక్కడే రిసార్టును బుక్ చేసుకున్న ఓ ఉమ్మడి కుటుంబంలోని ఆడపడుచు మాట ఇది. బ్రో మధ్యాహ్నంలోపే అక్కడకు చేరుకోవాలి. అర్ధరాత్రి దాకా ఇగ ధూంధామే. ఎక్కడా తగ్గేదేలే’ ఓ గెస్ట్హౌస్ను బుక్ చేసుకున్న ఓ స్నేహితుడి ఉత్సాహం ఇది.
పెద్దఅంబర్పేట, డిసెంబర్ 30 : ఒక్కరేంటి.. 2023 సంవత్సరానికి ఘనంగా ముగింపు పలికేందుకు అంతా సిద్ధమవుతున్నారు. రెట్టించిన ఉత్సాహంతో కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఏడాది చివరి రోజును అంతా కలిసి సందడిగా సాగనంపాలని నిర్ణయించుకున్నా రు. ఇందుకోసం హైదరాబాద్ శివారులోని ఫాం హౌస్లు, గెస్ట్హౌస్లు, రిసార్టులను వేదికగా చేసుకుంటున్నారు. పేరుగాంచిన రిసార్టులు ఇప్పటికే బుక్ అయిపోగా.. చిన్నాచితక గెస్ట్హౌస్లు, ఫాం హౌస్లకు సైతం మస్తు డిమాండ్ ఉన్నది.
నగర శివారులోని పలు ఫాంహౌస్లు, రిసార్టులను 24 గంటలకోసం ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు బుకింగ్ చేసుకొంటున్నారు. ఉదయం టిఫిన్ మొదలు మధ్యాహ్నం లం చ్, సాయంత్రం స్నాక్స్, రాత్రికి డిన్నర్ వరకు విభిన్నమైన ఆహార పదార్థాలతో విందులు ఆరగించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందుకోసం ఒక్కొక్క రు రూ.4 వేల నుంచి 6 వేల వరకు వెచ్చించనున్నారు. ఆయా రిసార్టుల్లో డీజేలతోపాటు స్విమ్మింగ్ఫూల్, ఆటలు ఆడుకునేందుకు అనువైన వసతులు కల్పిస్తున్నారు. కొన్ని రిసార్టులు పాస్లు కూడా జారీ చేశాయి.
కల్పిస్తున్న వసతులు, అందిస్తున్న ఆహార పదార్థాలు, మద్యం తదితరాలను బట్టి రిసార్టులు పాస్లు జారీచేస్తున్నాయి. ఒక్కో పాస్ను రూ.4 వేల నుంచి 6 వేల వరకు విక్రయించాయి. అక్కడ ఆహార పదార్థాల విషయంలో కొన్ని పరిమితులతో కొన్ని చోట్ల రూ.2 వేల వరకే వసూ లు చేస్తున్నాయి. కుటుంబసభ్యులు, స్నేహితులు ఏడాది చివరి రోజు ను సంతోషంగా గడిపేందుకు ఆసక్తి చూపుతున్నా రు. అది మరిచిపోలేని రోజుగా మిగిలిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆడిపాడాలని నిర్ణయించుకున్నారు. చిన్నపాటి డీజేలు ఏర్పాటుచేసుకుని ధూంధాం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రత్యేక ఈవెంట్లు ఏర్పాటుచేస్తున్నారు. అయితే, పలుచోట్ల ఫాంహౌస్లు రోజుకు రూ.12 వేల నుంచి 20 వేల వరకు వసూలు చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా వాటిలో అన్ని వసతులు కల్పిస్తున్నాయి. స్విమ్మింగ్ ఫూల్, గార్డెన్, ప్లే ఏరియాతోపాటు కిచెన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.చాలా మంది ఇలాంటి ఫాంహౌస్లు తీసుకొనేందుకు ఆ సక్తి చూపారు. అంతా కలిసి ఇష్టం వచ్చిన ఆహా ర పదార్థాలను స్వయం గా వండుకుని తినేలా ప్లా న్ చేసుకుంటున్నారు. అం దుకు అవసరమైన వస్తువుల ను సిద్ధం చేసుకుంటున్నారు.
ఇటీవల రోడ్ ట్రిప్పులకు డిమాండ్ పెరిగింది. కొందరు కుటుంబసభ్యులు, స్నేహితులు ఇండ్లకు దూరంగా న్యూఇయర్ను జరుపుకొనేందుకు ఇష్టపడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక వాహనాలు బుక్ చేసుకుంటున్నారు. కొందరు శ్రీశైలం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాల వైపు వెళ్తుండగా.. ఎక్కువ మంది నీటి అందాలను వీక్షించేందుకు వీలుగా జల వనరు లు అధికంగా ఉండే ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ‘మేం 20 మందిమి కలిసి నాగర్కర్నూల్ జిల్లాలోని సోమశిల వెళ్తున్నాం. ఆదివారం ఉదయమే బయలుదేరి సోమవారం సాయంత్రం వరకు అక్కడే ఉంటాం’ అని రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్న ఓ యువతి తెలిపింది. ఒక్కొక్కరికీ భోజనాలతో కలిపి రూ.5వేలు వేసుకుంటున్నట్లు చెప్పింది.
అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో 2023 సంవత్సరానికి వేడుకగా వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నారు. కేక్లు కోయడం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఆసక్తి చూపుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీల్లోని పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమా లు, ఆట పాటలకు అనువగా డీజేలు ఏర్పాటుచేస్తున్నారు. భారీగా పటాకులు కాల్చి కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేలా ప్లాన్ చేస్తున్నారు.