ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి : బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల ద్వారా కొనసాగుతున్న ప్రశాంత్కుమార్రెడ్డి పాదయాత్ర సోమవారం నాటికి 300 కిలోమీటర్ల మైలురాయి దాటింది. సోమవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని సీతారాంపేట్కు చేరుకున్న ప్రగతి నివేదన యాత్రకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. గత 23రోజులుగా యాచారం, మంచాల మండలాల్లోని 42గ్రామాల్లో నిర్వహించిన యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపగడపకు చేరడంతో పాటు ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సహకారంతో నియోజకవర్గంలోని గ్రామాల్లో చేపట్టిన వివిధ రకాల అభివృద్ధిపై ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే, ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతున్నారు.
సోమవారం సీతరాంపేట్కు చేరుకున్న ప్రశాంత్కుమార్రెడ్డి పాదయాత్రకు కౌన్సిలర్ కొండ్రు శ్రీలత రాంబాబు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రశాంత్కుమార్రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వం చేపడుతన్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించేందుకే ప్రగతి నివేదన యాత్రద్వారా ఇంటింటికీ తిరుగుతున్నట్లు తెలిపారు. ఎక్కడ ఎలాంటి సమస్యలున్నా ఎమ్మెల్యే కిషన్రెడ్డి ద్వారా పరిష్కరించనున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం ప్రగతి నివేదన యాత్ర రాయపోల్కు చేరుకుంటుందని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్చైర్మన్ ఆకుల యాదగిరి, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి వేణు, ఉత్తమ రైతు మొద్దు అంజిరెడ్డి, కౌన్సిలర్లు నీలం శ్వేత, కొండ్రు శ్రీలత రాంబాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ భరత్కుమార్, బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు జెర్కోని రాజు, నాయకులు అవుతాపురం రవిందర్, ప్రవీణ్నాయక్, సాయి, ప్రసాద్గౌడ్, విజయ్, వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.